హైదరాబాద్: తనపై ప్రవేశపెట్టిన అవిశ్వాసం వీగిపోవడంతో సభలో స్పీకర్ కోడెల మళ్లీ అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్టాడుతూ తనపై నమ్మకముంచి సభలోకి ఆహ్వానించినందుకు సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. తాను సభలో ఏకపక్షంగా వ్యవహరించాని ఆరోపణలు రావడం బాధాకరమన్నారు. వాస్తవానికి తాను ఎలాంటి పక్షపాత ధోరణి అవలంభించలేదని..కొన్ని సందర్భాల్లో ప్రతిపక్ష సభ్యులు అలా అర్థం చేసుకున్నారని వివరణ ఇచ్చారు. భవిష్యత్తులో మరింత మెరుగ్గా సభను నడిపిస్తానని తెలిపారు. 20 ఏళ్ల రాజకీయ అనుభవం ఉండటంతో తనకు స్పీకర్ పదవి వరించిందని..అంకిత భాంతో ప్రజలకు సేవ చేస్తున్నానని.. ప్రతిపక్షం తనపై అవిశ్వాసం పెట్టినప్పటికీ వారిపై తనకు ఏమాత్రం కోపం లేదన్నారు. ప్రజా ప్రతినిధుల సభల్లో ఇలాంటివి సహజమని స్పీకర్ కోడెల శివప్రసాద్ అన్నారు. ఈ ప్రసంగం అనంతరం స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారు.
సభను మరింత సమర్థవంతంగా నడిపిస్తా - కోడెల
హైదరాబాద్: తనపై పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోవడంతో సభలో స్పీకర్ కోడెల మళ్లీ అడుగుపెట్టారు.
TNN 15 Mar 2016, 6:01 pm
హైదరాబాద్: తనపై ప్రవేశపెట్టిన అవిశ్వాసం వీగిపోవడంతో సభలో స్పీకర్ కోడెల మళ్లీ అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్టాడుతూ తనపై నమ్మకముంచి సభలోకి ఆహ్వానించినందుకు సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. తాను సభలో ఏకపక్షంగా వ్యవహరించాని ఆరోపణలు రావడం బాధాకరమన్నారు. వాస్తవానికి తాను ఎలాంటి పక్షపాత ధోరణి అవలంభించలేదని..కొన్ని సందర్భాల్లో ప్రతిపక్ష సభ్యులు అలా అర్థం చేసుకున్నారని వివరణ ఇచ్చారు. భవిష్యత్తులో మరింత మెరుగ్గా సభను నడిపిస్తానని తెలిపారు. 20 ఏళ్ల రాజకీయ అనుభవం ఉండటంతో తనకు స్పీకర్ పదవి వరించిందని..అంకిత భాంతో ప్రజలకు సేవ చేస్తున్నానని.. ప్రతిపక్షం తనపై అవిశ్వాసం పెట్టినప్పటికీ వారిపై తనకు ఏమాత్రం కోపం లేదన్నారు. ప్రజా ప్రతినిధుల సభల్లో ఇలాంటివి సహజమని స్పీకర్ కోడెల శివప్రసాద్ అన్నారు. ఈ ప్రసంగం అనంతరం స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారు.