యాప్నగరం

స్పీకర్ మధుసూదనాచారికి తప్పిన ప్రమాదం..

తెలంగాణ సభాపతి మధుసూదనాచారి తృటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. పల్లె నిద్ర ముగించుకొని వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Samayam Telugu 9 Jun 2018, 4:08 pm
తెలంగాణ సభాపతి మధుసూదనాచారి తృటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. ఎస్కార్ట్ వాహనాన్ని లారీ ఢీకొట్టింది. తన నియోజవర్గం భూపాలపల్లిలోని గణపురం శివారులో ఈ ప్రమాదం జరిగింది. లారీ డ్రైవర్ తప్పిదం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఒక్కసారిగా జరిగిన ప్రమాదంతో కాన్వాయ్‌లోని వాహనాలు రోడ్డు కిందకి దూసుకెళ్లాయి. ప్రమాదం నుంచి స్పీకర్ మధుసూదనాచారి సురక్షితంగా బయటపడ్డారు.
Samayam Telugu speaker


స్పీకర్ మధుసూదనచారి శనివారం (జూన్ 9) ఉదయం తన నియోజకవర్గంలోని గణపురం మండల కేంద్రంలో పల్లె నిద్ర ముగించుకొని భూపాలపల్లి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అంతకుముందు ఆయన స్థానిక ప్రజలతో మమేకమవుతూ గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. రైతులతో కలిసి నాగలి పట్టి దుక్కిదున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.