యాప్నగరం

ఢీకొట్టాడు.. శవంతోనే కారుని పోనిచ్చాడు

మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో సోమవారం రాత్రి దారుణం చోటుచేసుకుంది. జడ్చర్ల, బూరెడ్డిపల్లి గ్రామాల మధ్య రోడ్డు

Samayam Telugu 20 Sep 2016, 10:28 am
మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో సోమవారం రాత్రి దారుణం చోటుచేసుకుంది. జడ్చర్ల, బూరెడ్డిపల్లి గ్రామాల మధ్య రోడ్డు దాటుతున్న శ్రీనివాస్ అనే స్థానిక వ్యక్తిని కర్నూలు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు ఢీకొట్టింది. శ్రీనివాస్‌ని ఢీకొన్న తర్వాత కూడా ఆ కారుని ఆపకుండా అలాగే ముందుకు పోనిచ్చాడు డ్రైవర్. తమ కారు ఢీకొన్న వ్యక్తి ప్రమాదంలో ఏమైనా గాయపడ్డాడా అని ఆపిచూసే ప్రయత్నమైనా చేయలేదు. కారు ఢీకొన్న సందర్భంలోనే ఎగిరి కారుటాప్‌పై పడిపోయిన శ్రీనివాస్ అలాగే కారుపైనే ప్రాణాలు విడిచాడు. కానీ అదేమీ గ్రహించని కారు డ్రైవర్ అలాగే శవంతో ముందుకు వెళ్లిపోయాడు.
Samayam Telugu speedy car hits a pedestrian and carries his dead body on top of the car
ఢీకొట్టాడు.. శవంతోనే కారుని పోనిచ్చాడు


అయితే, కారుపై ఓ వ్యక్తి శవమై పడివుండటం, కారుపై రక్తం దారలా కారుతుండటం గమనించిన స్థానికులు, కారుని వెంబడించి మాచారం వద్ద కారుని అడ్డుకున్నారు. అప్పటికే దాదాపు 3 కిలోమీటర్లు వెళ్లిన ఆ కారు డ్రైవర్.. కారుని అక్కడే వదిలిపరారయ్యాడు. స్థానికులు అందించిన సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న జడ్చర్ల పోలీసులు శ్రీనివాస్ మృతదేహాన్ని పోస్టుమార్టంకి తరలించి కారుని సీజ్ చేశారు. ఏపీ28సీకే 8477 నెంబర్ గల ఈ కారు హైదరాబాద్‌లోని కూకట్‌పల్లికి చెందిన చంద్రకళది గుర్తించిన పోలీసులు ప్రస్తుతం నిందితుడి వేటలో పడ్డారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.