యాప్నగరం

క్రిమినల్ కేసుతో గవర్నమెంట్ జాబ్ దూరం.. సంపాదన కోసం క్రాస్ మసాజ్..

క్రిమినల్ కేసు కారణంగా రావాల్సిన గవర్నమెంట్ జాబ్ ఆగిపోయింది. మరోవైపు ఖర్చులు పెరిగిపోయాయి. దీంతో సంపాదన కోసం అత్తతో కలిసి నిబంధనలను అతిక్రమించిన ఘనుడు.

Samayam Telugu 19 Jun 2018, 10:00 am
హైదరాబాద్: పురుషులకు అమ్మాయిలతో క్రాస్ మసాజ్ చేయిస్తోన్న ఓ మసాజ్ సెంటర్‌పై టాస్క్‌ఫోర్స్, నారాయణగూడ పోలీసులు సంయుక్తంగా దాడి చేసి ఏడుగుర్ని అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే నారాయణగూడ వైఎంసీఏ సర్కిల్‌లోని గురుపర్హా ఎస్టేట్‌లో స్ప్లాష్ బ్యూటీ సెలూన్ అండ్ స్పా సెంటర్ ఉంది. రాధిక రెడ్డి అనే మహిళ 2015లో దీన్ని ప్రారంభించింది. నెలకు రూ.40 వేల అద్దె కడుతూ యువతులతో మగవారికి క్రాస్ మసాజ్ చేయిస్తోంది.
Samayam Telugu cross-massage


2015-17 మధ్య రాధికా రెడ్డిపై మూడు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. గత ఆరు నెలలుగా స్పా వ్యవహారాలను ఆమె అల్లుడు గరిక సంతోష్ పర్యవేక్షిస్తున్నారు. వైజాగ్‌కు చెందిన సంతోష్ యూపీఎస్సీ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. కానీ అతడిపై క్రిమినల్ కేసు ఉండటంతో అతణ్ని హోల్డ్‌లో ఉంచారు.

ప్రభుత్వ ఉద్యోగం రాకపోవడం, ఆర్థిక సమస్యలు ఎక్కువ కావడంతో సంతోష్ స్పా సెంటర్‌ను ఆదాయ మార్గంగా ఎంచుకున్నాడు. బ్యూటీషియన్లతో క్రాస్ మసాజ్ చేయిస్తూ.. కస్టమర్లను ఆకర్షించడం మొదలు పెట్టాడు. 2016లోనే నారాయణగూడ పోలీసులు సంతోష్‌ను అరెస్ట్ చేశారు.

నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా క్రాస్ మసాజ్ చేస్తున్నారని సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ టీంకి పక్కా సమాచారం అందింది. దీంతో నారాయణగూడ పోలీసులతో కలిసి వారు మెరుపు దాడి చేశారు. ముగ్గురు బ్యూటీషియన్లు, ఇద్దరు కస్టమర్లతోపాటు నిర్వాహకుడిని, రిసెప్షనిస్టుని అరెస్ట్ చేశామని టాస్క్‌ఫోర్స్ కమిషనర్ తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.