యాప్నగరం

శ్రీవారి సన్నిధిలో శ్రీలంక అధ్యక్షుడు

శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన తిరుమల శ్రీవారి సన్నిధికి చేరుకున్నారు.

TNN 7 Oct 2017, 4:09 pm
శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన తిరుమల శ్రీవారి సన్నిధికి చేరుకున్నారు. శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దర్శనార్థం సతీ సమేతంగా శనివారం మధ్యాహ్నం సిరిసేన తిరుమలకు చేరుకున్నారు. పద్మావతి అతిథి గృహానికి చేరుకున్న సిరిసేన దంపతులకు తిరుమల జేఈవో కె.ఎస్‌.శ్రీనివాసరాజు, సీవీఎస్‌వో రవికృష్ణతో పాటు టీటీడీ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు.
Samayam Telugu sri lankan president maithripala sirisena arrives in tirumala
శ్రీవారి సన్నిధిలో శ్రీలంక అధ్యక్షుడు


ఆదివారం వేకువజామున కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సుప్రభాత సేవలో సిరిసేన పాల్గొంటారు. శ్రీలంక అధ్యక్షుడి పర్యటన నేపథ్యంలో తిరుమలలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. శ్రీలంక నుంచి నేరుగా బెంగళూరులో దిగిన సిరిసేన దంపతులు.. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా తిరుమలకు చేరుకున్నారు. కాగా, శ్రీలంక అధ్యక్షుడిగా సిరిసేన శ్రీవారిని దర్శించుకోవడం ఇది రెండోసారి. గతంలో 2015లో సిరిసేన తిరుమల వచ్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.