యాప్నగరం

అంతకు ముందే శ్రీదేవి ఆరోగ్యం బాగోలేదు: పింకీ రెడ్డి

​ మోహిత్ మర్వా పెళ్లి కోసం దుబాయ్ వెళ్లడానికి ముందే శ్రీదేవి ఆరోగ్యం బాగోలేదని ఆమె స్నేహితురాలు పింకీ రెడ్డి తెలిపారు. జ్వరంతో బాధపడుతున్నానని తనతో ఫోన్లో చెప్పిందని టి.సుబ్బిరామి రెడ్డి కుమార్తె అయిన పింకీ రెడ్డి చెప్పారు.

TNN 28 Feb 2018, 12:51 pm
మోహిత్ మర్వా పెళ్లి కోసం దుబాయ్ వెళ్లడానికి ముందే శ్రీదేవి ఆరోగ్యం బాగోలేదని ఆమె స్నేహితురాలు పింకీ రెడ్డి తెలిపారు. జ్వరంతో బాధపడుతున్నానని తనతో ఫోన్లో చెప్పిందని టి.సుబ్బిరామి రెడ్డి కుమార్తె అయిన పింకీ రెడ్డి చెప్పారు. 8 ఏళ్ల వయసు నుంచి మా మధ్య స్నేహం ఉందని చెప్పిన పింకీ రెడ్డి.. ఆప్త మిత్రురాలు మరణించడంతో షాకయ్యానని చెప్పారు. శ్రీదేవి మరణించిందంటే నమ్మలేకపోతున్నానని వాపోయారు.
Samayam Telugu sridevis childhood friend reveals her last conversation with the actress
అంతకు ముందే శ్రీదేవి ఆరోగ్యం బాగోలేదు: పింకీ రెడ్డి


గత ఏడాది నవంబర్లో పింకీ రెడ్డి ఇంట్లో శుభకార్యంలో పాల్గొనడం కోసం శ్రీదేవి ప్రత్యేకంగా హైదరాబాద్ వచ్చారు. ప్రియ నేస్తాన్ని చూడటం అదే చివరిసారని పింకీ రెడ్డి తెలిపారు. సర్జరీల వల్లే శ్రీదేవి చనిపోయిందనే వార్తల పట్ల ఆమె మండిపడ్డారు. బాత్ టబ్‌లో మునిగిపోవడం వల్లే శ్రీదేవి చనిపోయారని పోస్ట్ మార్ట్ నివేదికలో తేలిన సంగతి తెలిసిందే.

బోనీ కపూర్‌తో ఫోన్లో మాట్లాడానని, ఆయన ఏడుస్తూనే ఉన్నారని పింకీ రెడ్డి చెప్పారు. దంపతులిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారని, పోట్లాడుకోవడం కూడా తెలియదని ఆమె తెలిపారు. జాన్వీ సినిమా విడుదలకు సిద్ధం అవుతోన్నవేళ ఈ సంఘటన చోటు చేసుకోవడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.