యాప్నగరం

మహాప్రస్థానంలో శ్రీనివాస్ అంత్యక్రియలు పూర్తి

జాత్యంహకార దాడిలో అన్యాయంగా ప్రాణాలు పోగొట్టుకున్నాడు శ్రీనివాస్ కూచిభొట్ల.

TNN 28 Feb 2017, 3:01 pm
అమెరికాలోని కాన్సాస్ లో జరిగిన జాత్యాంహకార దాడిలో అన్యాయంగా ప్రాణాలు పోగొట్టుకున్నాడు శ్రీనివాస్ కూచిభొట్ల. ఆయన కుటుంబం హైదరాబాద్ లోని బాచుపల్లిలోని ప్రణీత్ రెసిడెన్సీలో నివసిస్తున్నారు. కాగా సోమవారం అర్థరాత్రికి శ్రీనివాసం మృతదేహం ఇంటికి చేరింది. మంగళవారం మధ్యాహ్నం జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఇంటి నుంచి ప్రత్యేక వాహనంలో శ్రీనివాస్ పార్థివ దేహాన్ని మహాప్రస్థానానికి చేర్చారు బంధువులు. భారీ సంఖ్యలో బంధువులు, స్నేహితులు అక్కడికి కడచూపు కోసం అక్కడికి వచ్చారు. చివరికి అతనిలో ఎలాంటి పరిచయం లేని వాళ్లు కూడా వచ్చి నివాళులు అర్పించారు. కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, సినీనటుడు రాజశేఖర్, జీవిత దంపతులు, కేఏ పాల్ కూడా వచ్చారు. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో అంత్యక్రియలు పూర్తయ్యాయి.
Samayam Telugu srinivas kuchibhotlas last rites performed in jubilee hills mahaprasthanam
మహాప్రస్థానంలో శ్రీనివాస్ అంత్యక్రియలు పూర్తి


శ్రీనివాస్ భార్య సునయన, తల్లిదండ్రులు మధుసూదన్, వర్ధినిని ఓదార్చడం ఎవరితరం కాలేదు. సునయన, శ్రీనివాస్ కి ఆన్ లైన్ లో పరిచయం అయ్యింది. 2005లో శ్రీనివాస్ అమెరికాలో ఉన్నత చదువుకు వెళ్లగా, 2007లో సునయన వెళ్లింది. వారిద్దరూ 2012లో పెళ్లి చేసుకున్నారు. కాన్సాస్ లోని న్యూఓలెత్ ప్రాంతంలో ఇల్లు కూడా కొనుక్కున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.