యాప్నగరం

నేటి నుంచి పదోతరగతి పరీక్షలు ప్రారంభం

తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభమవుతున్నాయి.

TNN 14 Mar 2017, 7:48 am
తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. నేటి నుంచి ఎస్సెస్సీ ఒకేషనల్ కోర్సు విద్యార్థులకు, 17వ తేదీ నుంచి జనరల్ విద్యార్థులకు పరీక్షలు జరుగుతాయి. ఉదయం తొమ్మిదిన్నరకు పరీక్ష ప్రారంభం అవుతుందని, మధ్యాహ్నం 12.15 వరకు జరుగుతుందని చెప్పారు. అయితే అయిదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా అనుమతి ఇస్తారు. అంతకన్నా ఆలస్యమైతే మాత్రం అనుమతించమని చెప్పారు అధికారులు. ట్రాఫిక్ రద్దీని ఎక్కువగా ఉంటుంది కనుక.. ఉదయం 8.45 కల్లా సెంటర్లకు విద్యార్థులు చేరుకోవాలని అధికారులు సూచించారు. స్కూల్ యూనిఫారంలో కూడా పరీక్షలకు రాకూడదని చెప్పారు. పరీక్ష హాల్ లోకి విద్యార్థులు, ఇన్వెజిలేటర్లు సెల్ ఫోన్లు తీసుకురావొద్దని ఆదేశించారు. అత్యవసరంగా ఎవరికైనా ఫోన్ చేయాలి అనుకుంటే... అక్కడ పహారా కాసే పోలీసుల ఫోన్లు వాడుకోవచ్చని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా 5,38,226 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా వారిలో 5,09,831 మంది రెగ్యులర్ విద్యార్థులుగా ఉన్నారు. వీరికోసం మొత్తం 2,556 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. 28 వేల మంది ఇన్విజిలేటర్లను ఏర్పాలు చేశారు.
Samayam Telugu ssc exams starts from today in telangana state
నేటి నుంచి పదోతరగతి పరీక్షలు ప్రారంభం


ఎవరికైనా హాల్‌టిక్కెట్లు అందని పక్షంలో వెంటనే WWW. BSETELANGANA.ORG అనే వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేుకోవాలి. వెబ్‌సైట్ నుంచి తీసుకున్న హాల్‌టిక్కెట్‌పై హెచ్‌ఎం సంతకం చేయించుకోవాలి. పరీక్షాకేంద్రాల వద్ద 144 సెక్షన్ ను అమలు చేస్తున్నారు అధికారులు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.