యాప్నగరం

రాష్ట్రం మిమ్మల్ని చూసి గర్విస్తోంది: జగన్

ప్రత్యేకహోదా పోరాటంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఢిల్లీలో చేపట్టిన నిరాహార దీక్ష ఆరో రోజుకు చేరుకుంది.

Samayam Telugu 11 Apr 2018, 11:56 am
ప్రత్యేకహోదా పోరాటంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఢిల్లీలో చేపట్టిన నిరాహార దీక్ష ఆరో రోజుకు చేరుకుంది. మొత్తం ఐదు మంది ఎంపీలు తమ పదవులకు రాజీనామా పత్రాలను ఇచ్చిన అనంతరం, ఏపీ భవన్ వేదికగా ఈ దీక్షను చేపట్టారు. ప్రస్తుతం ఇద్దరు ఎంపీలతో దీక్ష కొనసాగుతూ ఉంది. మిథున్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డిలు నిరాహార దీక్షను సాగిస్తూ ఉన్నారు. వీళ్ల ఆరోగ్యం క్షీణించిందని వైద్యులు ప్రకటించినప్పటికీ.. దీక్షను కొనసాగిస్తుండటం గమనార్హం.
Samayam Telugu mithunavinash


నిరాహార దీక్షలో ఉన్న ఎంపీలకు సంఘీభావంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఢిల్లీ చేరుకున్నారు. తొలి రోజు నుంచి దశల వారీగా వైసీపీ నేతలు, ఎమ్మెల్యేలు ఎంపీల దీక్షకు సంఘీభావం ప్రకటిస్తూ ఉన్నారు.

దీక్షలో ఉన్న అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డిలతో వైఎస్సార్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మాట్లాడారు. స్కైప్ ద్వారా వారిని జగన్ పలకరించారు. నిరాహార దీక్షతో హోదా కోసం పోరాడుతున్న వారిని జగన్ అభినందించారు. మిమ్మల్ని చూసి రాష్ట్రం గర్వపడుతోందని జగన్ వారితో అన్నారు. ప్రజాసమస్యలపై జగన్ పలుసార్లు నిరాహార దీక్షను చేపట్టారని, అదెంత కష్టసాధ్యమో ఇప్పుడు తమకు అర్థం అవుతోందని మిథున్ రెడ్డి వ్యాఖ్యానించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.