యాప్నగరం

జమ్మలమడుగు: టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ!

కడప జిల్లా జమ్మలమడుగు మండలం పెద్దదండ్లూరులో వైసీపీ, టీడీపీ వర్గీయుల మధ్య ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది. రెండు పార్టీలకు చెందిన శ్రేణులు ఒకరి ఇళ్లపై మరొకరు పరస్పరం రాళ్లు రువ్వుకోవడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Samayam Telugu 3 Jun 2018, 7:47 pm
కడప జిల్లా జమ్మలమడుగు మండలం పెద్దదండ్లూరులో వైసీపీ, టీడీపీ వర్గీయుల మధ్య ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది. ఆదివారం (జూన్ 3) వైసీపీకి చెందిన కడప ఎంపీ అవినాష్‌రెడ్డి పెద్దదండ్లూరు గ్రామంలో పర్యటించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. పర్యటనలో భాగంగా ఆయన ఏఆర్‌ సంపత్‌కుమార్‌, మరో ఐదు కుటుంబాలను కలవాల్సి ఉంది. అయితే గ్రామంలో అవినాష్ రెడ్డి పర్యటనను నిరసిస్తూ.. మంత్రి ఆదినారాయణరెడ్డి వర్గీయులు సంపత్‌కుమార్‌ ఇంటి వద్ద కలకలం సృష్టించారు. దీంతో రెండు పార్టీలకు చెందిన శ్రేణులు ఒకరి ఇళ్లపై మరొకరు పరస్పరం రాళ్లు రువ్వుకోవడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Samayam Telugu avinash


అప్రమత్తమైన పోలీసులు పెదదండ్లూరు శివారులోనే.. ఎంపీ అవినాష్‌ రెడ్డితోపాటు జమ్మలమడుగు కోఆర్డినేటర్ సుధీర్‌రెడ్డి, కడప మేయర్‌ సురేశ్‌బాబును అడ్డుకున్నారు. ఇలాంటి చర్యలు అప్రజాస్వామికమని ఎంపీ అవినాష్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కార్యకర్తల ఇళ్లపై దాడులు చేస్తుంటే ఊరుకోమని..గ్రామంలోకి వెళ్తామని సుధీర్‌ రెడ్డి, సురేశ్‌ బాబులు పట్టుబట్టారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి తరలించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.