తెలంగాణలో గొర్రెలు అకారణంగా మృత్యువాతపడుతున్న ఘటనలు కొనసాగుతున్నాయి. తాజాగా ఓ గొర్రెల మందపై వీధి కుక్కలు దాడి చేయడంతో 20 జీవాలు దుర్మరణం పాలయ్యాయి. రంగారెడ్డి జిల్లా పోల్కంపల్లి గ్రామంలో ఈ విషాదం చోటు చేసుకుంది. ఒకేసారి 20 గొర్రెలు మరణించడంతో.. యజమాని కొమురయ్య కన్నీరుమున్నీరవుతున్నాడు. కుక్కల దాడిలో తీవ్రంగా నష్టపోయినట్లు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు తెలంగాణలో గత 20 రోజులుగా వివిధ ప్రమాదాల కారణంగా వందలాది గొర్రెలు మరణించడం ఆందోళన కలిగిస్తోంది.
అక్టోబర్ 22న యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట వద్ద ఫలక్ నుమా ట్రెయిన్ ఢీకొట్టి 400 గొర్రెలు మరణించాయి. ఈ తర్వాత రెండు రోజులకే రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో 30 గొర్రెలు మృత్యువాతపడ్డాయి. నవంబర్ 3న జోగులాంబ గద్వాల జిల్లాలో గొర్రెలను తరలిస్తున్న ఓ డీసీఎం బోల్తా పడటంతో 120 జీవాలు దుర్మరణం పాలయ్యాయి.
Also Read: డీసీఎం బోల్తా.. 120 గొర్రెలు మృతి
అక్టోబర్ 22న యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట వద్ద ఫలక్ నుమా ట్రెయిన్ ఢీకొట్టి 400 గొర్రెలు మరణించాయి. ఈ తర్వాత రెండు రోజులకే రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో 30 గొర్రెలు మృత్యువాతపడ్డాయి. నవంబర్ 3న జోగులాంబ గద్వాల జిల్లాలో గొర్రెలను తరలిస్తున్న ఓ డీసీఎం బోల్తా పడటంతో 120 జీవాలు దుర్మరణం పాలయ్యాయి.
Also Read: డీసీఎం బోల్తా.. 120 గొర్రెలు మృతి