యాప్నగరం

గొర్రెలు-ఘోరాలు: కుక్కల దాడిలో 20 జీవాలు మృతి

గొర్రెల మందపై వీధి కుక్కలు దాడి చేయడంతో 20 జీవాలు దుర్మరణం పాలయ్యాయి. రంగారెడ్డి జిల్లా పోల్కంపల్లి గ్రామంలో ఈ విషాదం చోటు చేసుకుంది.

TNN 6 Nov 2017, 10:28 am
తెలంగాణలో గొర్రెలు అకారణంగా మృత్యువాతపడుతున్న ఘటనలు కొనసాగుతున్నాయి. తాజాగా ఓ గొర్రెల మందపై వీధి కుక్కలు దాడి చేయడంతో 20 జీవాలు దుర్మరణం పాలయ్యాయి. రంగారెడ్డి జిల్లా పోల్కంపల్లి గ్రామంలో ఈ విషాదం చోటు చేసుకుంది. ఒకేసారి 20 గొర్రెలు మరణించడంతో.. యజమాని కొమురయ్య కన్నీరుమున్నీరవుతున్నాడు. కుక్కల దాడిలో తీవ్రంగా నష్టపోయినట్లు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు తెలంగాణలో గత 20 రోజులుగా వివిధ ప్రమాదాల కారణంగా వందలాది గొర్రెలు మరణించడం ఆందోళన కలిగిస్తోంది.
Samayam Telugu street dogs killed 20 sheep in rangareddy
గొర్రెలు-ఘోరాలు: కుక్కల దాడిలో 20 జీవాలు మృతి


అక్టోబర్ 22న యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట వద్ద ఫలక్ నుమా ట్రెయిన్ ఢీకొట్టి 400 గొర్రెలు మరణించాయి. ఈ తర్వాత రెండు రోజులకే రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో 30 గొర్రెలు మృత్యువాతపడ్డాయి. నవంబర్ 3న జోగులాంబ గద్వాల జిల్లాలో గొర్రెలను తరలిస్తున్న ఓ డీసీఎం బోల్తా పడటంతో 120 జీవాలు దుర్మరణం పాలయ్యాయి.

Also Read: డీసీఎం బోల్తా.. 120 గొర్రెలు మృతి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.