యాప్నగరం

IIT Student Anirudhya: హైదరాబాద్ - బిల్డింగ్‌పై నుంచి పడి ఐఐటీ విద్యార్థి మృతి

అనిరుధ్ ఐఐటీ క్యాంపస్‌లో మెకానికల్ , ఎయిరోస్పేస్ విభాగంలో ఇంజనీరింగ్ చేస్తున్నాడు. ఫ్రెండ్ రూమ్‌కు వెళ్లి తిరిగొస్తుండగా భవనంపై నుంచి కిందపడి చనిపోయాడు.

Samayam Telugu 2 Feb 2019, 9:30 am
సంగారెడ్డి జిల్లా కంది ఐఐటీలో విషాదం జరిగింది. గురువారం అర్థరాత్రి ఓ విద్యార్థి భవనంపై నుంచి కిందపడి చనిపోయాడు. అనిరుధ్ ఐఐటీ క్యాంపస్‌లో మెకానికల్ , ఎయిరోస్పేస్ విభాగంలో ఇంజనీరింగ్ చేస్తున్నాడు. శుక్రవారం రాత్రి హాస్టల్‌లోని తన ఫ్రెండ్ రూమ్‌కి వెళ్లి తిరిగి వస్తుండగా.. భవనం నాలుగో అంతస్తు నుంచి జారిపడ్డాడు. అతడి తలకు తీవ్రగాయం కావడంతో ఆస్పత్రికి తరలించారు. అనిరుధ్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ప్రాణాలు విడిచాడు.
Samayam Telugu 1200


ఈ ఘటనపై అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. అనిరుధ్ ప్రమాదవశాత్తూ పడిపోయాడా.. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా తోసేశారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో అనిరుధ్ ఫోన్ మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. అనిరుధ్ స్వస్థలం గుంటూరుజిల్లా కాగా.. తల్లిదండ్రులు హైదరాబాద్ బోయిన్‌పల్లిలో నివాసం ఉంటున్నారు. కుమారుడి మరణంతో కన్నీరుమున్నీరయ్యారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.