యాప్నగరం

ప్రాణాల మీదకు తెచ్చిన 'సెల్ఫీ' పిచ్చి..!

సోషల్ మీడియా ప్రభావంతో యువతలో సెల్ఫీల పిచ్చి ఎక్కువైంది. సెల్ఫీల కోసం ఎలాంటి సాహసానికైనా తెగిస్తున్నారు. చివరికి ప్రాణాల మీదకు సైతం తెచ్చుకుంటున్నారు.

Samayam Telugu 30 May 2018, 5:09 pm
సోషల్ మీడియా ప్రభావంతో యువతలో సెల్ఫీల పిచ్చి ఎక్కువైంది. సెల్ఫీల కోసం ఎలాంటి సాహసానికైనా తెగిస్తున్నారు. చివరికి ప్రాణాల మీదకు సైతం తెచ్చుకుంటున్నారు. తాజాగా కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో ఇలాంటి ఘటనే జరిగింది. సెల్ఫీ మోజులో.. ఓ పదోతరగతి విద్యార్థి గూడ్స్ రైలు ఎక్కి సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించి.. ప్రమాదానికి గురై ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
Samayam Telugu goods-train


రామసాయి అనే పదోతరగతి విద్యార్థి జగ్గయ్యపేటలో ఆగి ఉన్న గూడ్స్ రైలు పైకెక్కి'సెల్ఫీ' తీసుకునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో విద్యుత్‌ హైటెన్షన్ వైర్లను గమనించని రామసాయి.. అనుకోకుండా వాటికి తగిలాడు. దీంతో తీవ్ర విద్యుదాఘాతానికి గురై.. రైలు పైనుంచి కిందకు పడిపోయాడు. ముఖం, కాళ్లు, చేతులు తీవ్రంగా కాలిపోయాయి. వెంటనే అప్రమత్తమైన అక్కడి స్థానికులు, రైల్వే సిబ్బంది స్థానిక ఆస్పత్రికి తరలించారు. తీవ్రగాయాలపాలైన విద్యార్థి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం విజయవాడకు తరలించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.