యాప్నగరం

జిల్లా వ్యవస్థాపక దినోత్సవం: విద్యార్థులకు శిక్ష

మండే ఎండలో సుమారు 80 మంది విద్యార్థులను మోకాళ్లపై మెడలు వంచి కూర్చోబెట్టిన సంఘటన తెలంగాణ రాష్ట్రంలోని కొత్తగా ఏర్పడిన జిల్లా వికారాబాద్‌లో జరిగింది.

TNN 12 Oct 2017, 12:05 am
మండే ఎండలో సుమారు 80 మంది విద్యార్థులను మోకాళ్లపై మెడలు వంచి కూర్చోబెట్టిన సంఘటన తెలంగాణ రాష్ట్రంలోని కొత్తగా ఏర్పడిన జిల్లా వికారాబాద్‌లో జరిగింది. ఈ విద్యార్థులు ఏదైనా పొరపాటు చేసినందుకే ఉపాధ్యాయులు ఈ శిక్ష వేశారు అనుకుంటే పొరపాటే. అసలు విషయానికి వస్తే.. తెలంగాణ రాష్ట్రంలో తొలివిడతగా ఏర్పాటు చేసే ఏడు జిల్లాల జాబితాలో వికారాబాద్‌‌ను చేర్చి ఏడాది ముగిసిన సందర్భంగా జరిపిన వ్యవస్థాపక దినోత్సవంలో భాగంతో వికారాబాద్‌ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది.
Samayam Telugu students made to kneel down in hot sun to celebrate vikarabad district formation day
జిల్లా వ్యవస్థాపక దినోత్సవం: విద్యార్థులకు శిక్ష


కొత్త జిల్లా ఏర్పాటు దినోత్సవాన్ని పురస్కరించుకుని జరిగిన వేడుకల్లో భాగంగా సుమారు 80 విద్యార్థులను VKB DIST ఆకారంలో మూడుగంటల పాటు ఎండలో నేలపై కూర్చోబెట్టారు పాఠశాల ఉపాధ్యాయులు. అయితే ఈ విషయంపై బాలల హక్కుల సంఘం సీరియస్ అయ్యింది. ఈ సందర్భంగా చైల్డ్ రైట్స్ అసోషియేషన్ అధ్యక్షుడు అత్యుతరావు మాట్లాడుతూ.. జిల్లా పరిషత్ స్కూల్‌లో జరిగిన ఈ సంఘటనపై పాఠశాల ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. వ్యవస్థాపక దినోత్సవం నాడు పిల్లల్ని హింసించడం దారుణం అని.. వారిని భోజనానికి కూడా పోనీయకుండా మోకాళ్లపై కూర్చోబెట్టారన్నారు. అయితే ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్‌ దివ్యకు తెలియజేయడానికి ప్రయత్నించామని ఆవిడ సెలవులో ఉన్నారన్నారు.

కాగా బుధవారం జరిగిన వికారాబాద్ జిల్లా వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొన్న మంత్రి మహేందర్ రెడ్డి కొత్త కలెక్టర్ భవనానికి శంకుస్థాపన కార్యక్రమాలను చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.