ఇద్దరు డాక్టర్లు.. కలసి హాస్పిటల్ నడిపారు. ఆర్థిక లావాదేవీల్లో తేడాలు వచ్చాయి. వ్యాపారంలో ఎక్కువ వాటా కలిగిన లేడీ డాక్టర్.. మరో డాక్టర్ను బయటికి పంపేశారు. ఆమెపై కక్ష పెంచుకున్న డాక్టర్ తన వ్యాపార భాగస్వామిని హత్య చేసేందకు కుట్ర పన్నాడు. ఈ పనిచేయడానికి ఇద్దరికి రూ.10 లక్షలు సుపారీ ఇచ్చాడు. ఆమెను చంపడానికి రెండుసార్లు విఫలయత్నం చేసిన సుపారీ తీసుకున్న వ్యక్తులు అతి తెలివి ప్రదర్శించారు. చంపకుండా ఉండేందుకు లేడీ డాక్టర్ నుంచి డబ్బులు గుంజేందుకు ప్రయత్నించారు. ఆమె పోలీసులను ఆశ్రయించడంతో అడ్డంగా దొరికిపోయారు. ఈ ఘటన హైదరాబాద్లోని హయత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
ఎల్బీ నగర్ డీసీపీ ఎం.వెంకటేశ్వర్రావు వెల్లడించిన వివరాల ప్రకారం.. నగర శివారు బండ్లగూడ సమీపంలోని ఇందు అరణ్య అపార్టుమెంట్లో బొమ్మినేని దుర్గారాణి గైనకాలజిస్టుగా పనిచేస్తున్నారు. ఈమెకు కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలో శ్రీసాయి ఆసుపత్రి, హైదరాబాద్ నగరంలోని కర్మాన్ఘాట్లో జీవన్ ఆసుపత్రులున్నాయి. కాగా వరంగల్ జిల్లా శాయంపేటకు చెందిన డాక్టర్ బుర్ర రమేష్గౌడ్(45).. పెద్దపల్లిలో శ్రీసాయి ఆసుపత్రిలో మెడికల్ పార్మసీని ఏర్పాటు చేస్తానని డాక్టర్ దుర్గారాణి కలిశాడు. తరువాత 2012లో కర్మాన్ఘాట్లో నెలకొల్పిన జీవన్ ఆసుపత్రిలో రూ. 43 లక్షలు పెట్టుబడితో భాగస్వామిగా చేరాడు.
అయితే సంవత్సరం తరువాత వీరిద్దరి మధ్య ఆర్థిక పరమైన విబేధాలు వచ్చాయి. దీంతో విడిపోయారు. కానీ ఆసుపత్రి ఆర్థిక వ్యవహారాల గురించి రమేష్గౌడ్కే పూర్తిగా తెలుసు. అందుకుని అతన్ని అదే ఆసుపత్రిలో మరో రెండేళ్లపాటు డాక్టర్ దుర్గారాణి ఉద్యోగంలో ఉంచారు. అయినా రమేష్గౌడ్ తీరు మారకపోవడంతో 2015లో ఉద్యోగం నుంచి తీసేశారు. దీంతో కక్ష పెంచుకున్న రమేష్గౌడ్.. రెండు నెలలో డాక్టర్ దుర్గారాణిని చంపాలని వరంగల్ జిల్లా హసన్పర్తి మండలం సీతంపేట గ్రామానికి చెందిన జంపాల రమేష్, మహ్మద్ రఫీలతో రూ. 10 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అడ్వాన్సుగా నాలుగు దఫాలుగా రూ.5 లక్షలు రఫీకి ఇచ్చాడు.
డాక్టర్ దుర్గారాణిని చంపడానికి హైదరాబాద్, పెద్దపల్లిలో దుండగులు ప్లాన్ వేశారు. అయితే రెండు సార్లు విఫలమయ్యారు. దీంతో రఫీకి రమేష్గౌడ్ నుంచి ఒత్తిడి పెరిగింది. ఈ క్రమంలో డాక్టర్ దుర్గారాణి వద్ద నుంచి కూడా డబ్బులు కాజేయాలని రఫీ భావించాడు. అతి తెలివి ప్రదర్శించి అక్టోబర్ 13న దుర్గారాణి భర్త రమేష్బాబును కలిసి మీ భార్యను చంపాలని రమేష్గౌడ్ తమతో ఒప్పందం కుదుర్చుకున్నాడని, రూ. 10 లక్షలు ఇస్తే ఊరుకుంటానని చెప్పాడు. దీంతో అక్టోబర్ 16న డాక్టర్ దుర్గారాణి రాచకొండ కమిషనర్ మహేష్భగవత్కు ఫిర్యాదు చేశారు. కమిషనర్ ఆదేశంతో హయత్నగర్ పోలీసులు కేసు నమోదు చేసి రఫీ, రమేష్లను అరెస్టు చేశారు. వారిని ఎ2, ఎ3 నిందితులుగా చేర్చి రిమాండ్కు పంపారు. ఎ1 నిందితుడు రమేష్గౌడ్ పరారీలో ఉన్నాడు.
ఎల్బీ నగర్ డీసీపీ ఎం.వెంకటేశ్వర్రావు వెల్లడించిన వివరాల ప్రకారం.. నగర శివారు బండ్లగూడ సమీపంలోని ఇందు అరణ్య అపార్టుమెంట్లో బొమ్మినేని దుర్గారాణి గైనకాలజిస్టుగా పనిచేస్తున్నారు. ఈమెకు కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలో శ్రీసాయి ఆసుపత్రి, హైదరాబాద్ నగరంలోని కర్మాన్ఘాట్లో జీవన్ ఆసుపత్రులున్నాయి. కాగా వరంగల్ జిల్లా శాయంపేటకు చెందిన డాక్టర్ బుర్ర రమేష్గౌడ్(45).. పెద్దపల్లిలో శ్రీసాయి ఆసుపత్రిలో మెడికల్ పార్మసీని ఏర్పాటు చేస్తానని డాక్టర్ దుర్గారాణి కలిశాడు. తరువాత 2012లో కర్మాన్ఘాట్లో నెలకొల్పిన జీవన్ ఆసుపత్రిలో రూ. 43 లక్షలు పెట్టుబడితో భాగస్వామిగా చేరాడు.
అయితే సంవత్సరం తరువాత వీరిద్దరి మధ్య ఆర్థిక పరమైన విబేధాలు వచ్చాయి. దీంతో విడిపోయారు. కానీ ఆసుపత్రి ఆర్థిక వ్యవహారాల గురించి రమేష్గౌడ్కే పూర్తిగా తెలుసు. అందుకుని అతన్ని అదే ఆసుపత్రిలో మరో రెండేళ్లపాటు డాక్టర్ దుర్గారాణి ఉద్యోగంలో ఉంచారు. అయినా రమేష్గౌడ్ తీరు మారకపోవడంతో 2015లో ఉద్యోగం నుంచి తీసేశారు. దీంతో కక్ష పెంచుకున్న రమేష్గౌడ్.. రెండు నెలలో డాక్టర్ దుర్గారాణిని చంపాలని వరంగల్ జిల్లా హసన్పర్తి మండలం సీతంపేట గ్రామానికి చెందిన జంపాల రమేష్, మహ్మద్ రఫీలతో రూ. 10 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అడ్వాన్సుగా నాలుగు దఫాలుగా రూ.5 లక్షలు రఫీకి ఇచ్చాడు.
డాక్టర్ దుర్గారాణిని చంపడానికి హైదరాబాద్, పెద్దపల్లిలో దుండగులు ప్లాన్ వేశారు. అయితే రెండు సార్లు విఫలమయ్యారు. దీంతో రఫీకి రమేష్గౌడ్ నుంచి ఒత్తిడి పెరిగింది. ఈ క్రమంలో డాక్టర్ దుర్గారాణి వద్ద నుంచి కూడా డబ్బులు కాజేయాలని రఫీ భావించాడు. అతి తెలివి ప్రదర్శించి అక్టోబర్ 13న దుర్గారాణి భర్త రమేష్బాబును కలిసి మీ భార్యను చంపాలని రమేష్గౌడ్ తమతో ఒప్పందం కుదుర్చుకున్నాడని, రూ. 10 లక్షలు ఇస్తే ఊరుకుంటానని చెప్పాడు. దీంతో అక్టోబర్ 16న డాక్టర్ దుర్గారాణి రాచకొండ కమిషనర్ మహేష్భగవత్కు ఫిర్యాదు చేశారు. కమిషనర్ ఆదేశంతో హయత్నగర్ పోలీసులు కేసు నమోదు చేసి రఫీ, రమేష్లను అరెస్టు చేశారు. వారిని ఎ2, ఎ3 నిందితులుగా చేర్చి రిమాండ్కు పంపారు. ఎ1 నిందితుడు రమేష్గౌడ్ పరారీలో ఉన్నాడు.