యాప్నగరం

'కాళేశ్వరం'పై దాఖలైన పిటిషన్‌ కొట్టివేత..!

తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు లైన్ క్లియర్ అయింది. ప్రాజెక్టు నిర్మాణంపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు శుక్రవారం (ఫిబ్రవరి 23న) కొట్టివేసింది.

TNN 23 Feb 2018, 1:41 pm
తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు లైన్ క్లియర్ అయింది. ప్రాజెక్టు నిర్మాణంపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు శుక్రవారం (ఫిబ్రవరి 23న) కొట్టివేసింది. పర్యావరణ అనుమతులను సవాల్ చేస్తూ... ముంపు గ్రామాల్లో సరైన చర్యలు చేపట్టకుండా పనులు చేస్తున్నారని సుప్రీంకోర్టులో హయత్‌ఉద్దీన్‌ అనే వ్యక్తి పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు.. పిటిషనర్‌ను మందలించింది. చెన్నై బెంచ్‌ నుంచి దిల్లీకి ఎందుకు వచ్చారని ప్రశ్నించింది. కేసును ఆలస్యంగా దాఖలు చేశారని పేర్కొంది. ఒక చోట కాకపోతే మరో చోటికి వస్తారా.. అంటూ చురకలంటించింది. ఈ కేసు విచారణకు అర్హం కాదని... పిటిషనర్ ఆలోచన సరిగా లేదంటూ.. పిటిషన్‌ను తిరస్కరించింది.
Samayam Telugu supreme court dismisses petition against kaleshwaram
'కాళేశ్వరం'పై దాఖలైన పిటిషన్‌ కొట్టివేత..!


సుప్రీం తీర్పుపై నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేశారు. పిటిషన్‌ను కొట్టివేసిన విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు స్వయంగా ఫోన్‌ చేసి తెలిపారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మీడియాతో మాట్లాడుతూ.... కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారికి వ్యతిరేకంగా తీర్పు వచ్చిందని... చివరికి న్యాయమే గెలిచిందని పేర్కొన్నారు. ప్రాజెక్టు పనులు మరింత వేగంగా పూర్తయ్యేలా చూస్తామని చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.