యాప్నగరం

బహిష్కరణ ఎత్తివేత.. నేడు న‌గ‌రానికి రానున్న ప‌రిపూర్ణానంద‌

స్వామీజీపై నగర బహిష్కరణను ఎత్తివేయడంతో.. నేడు నగరానికి రానున్న స్వామి పరిపూర్ణానంద.. ఘనంగా స్వాగతం పలికేందుకు సిద్ధమైన భారతీయ జనతా పార్టీ, హిందూ సంస్థలు..

Samayam Telugu 4 Sep 2018, 9:08 am
శ్రీపీఠం అధ్యక్షుడు పరిపూర్ణానంద స్వామిపై నగర బహిష్కరణ ఎత్తివేయడంతో నేడు (సెప్టెంబరు 4) హైదరాబాద్‌లో అడుగుపెట్టనున్నారు. ఈ ఉదయం 10 గంటలకు విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడి నుంచి హైదరబాద్‌‌కు బయలుదేరుతారు. కోదాడ నుంచి సూర్యాపేట, నకిరేకల్, నార్కట్‌పల్లి, చిట్యాల, చౌటుప్పల్ మీదుగా మధ్యాహ్నం రెండు గంటలకు హయత్‌నగర్‌కు చేరుకుంటారు.
Samayam Telugu paripoornananda


పరిపూర్ణానంద నగరానికి చేరుకోగానే.. ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు బీజేపీ నేతలతోపాటు.. వివిధ హిందూ సంఘాలు, మహిళా సంఘాలు, వివిధ దేవాలయాల సంఘాలు సిద్ధంగా ఉన్నాయి. అనంతరం ఎల్బీనగర్, దిల్‌షుఖ్‌నగర్, కోఠీ మీదుగా బయలుదేరి బషీర్‌బాగ్‌లోని అమ్మవారి ఆలయానికి చేరుకుని అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.

స్వామి పరిపూర్ణానందను ఆరునెల‌ల పాటు నగర బహిష్కరిస్తూ.. జులై 11న పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. తనపై అకారణంగా నగర బహిష్కరణ వేటు వేశారని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ విష‌య‌మై విచారించిన హైకోర్టు స్వామీజీపై నగర బహిష్కరణను ఎత్తివేస్తూ తీర్పునిచ్చింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.