సికింద్రాబాద్లోని వైడబ్ల్యూసీఏలో ‘స్వయంభర్ నారీ ఎగ్జిబిషన్’ ప్రారంభమైంది. ఆగస్టు 24 వరకు సాగనున్న ఈ ఎగ్జిబిషన్లో వైవిధ్య రకాల హ్యాండీక్రాఫ్ట్స్ ప్రదర్శిస్తున్నారు. 500 ఏళ్ల కిందటి ప్రత్యేక సంప్రదాయ చీరలు కూడా ప్రదర్శనలో ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. కలకత్తా (పశ్చిమ బెంగాల్)లోని శాంతినికేతన్కు చెందిన స్వచ్ఛంద సంస్థ ‘స్వయంభర్ నారీ’ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని భాగ్యనగరంలో ఈ ప్రదర్శన ఏర్పాటు చేసింది. ఈ స్వచ్ఛంద సంస్థకు కేంద్ర ప్రభుత్వ వివిధ శాఖలకు చెందిన సంస్థల మద్దతు కూడా ఉంది.
ఒడిస్సీ నృత్యకారిణి నయనతార నందకుమార్ శుక్రవారం (ఆగస్టు 18) ఈ హస్తకళా ప్రదర్శనను ప్రారంభించారు. వారం రోజుల పాటు ఉదయం 10 గంటల నుంచి 8 గంటల వరకు ఈ ఎగ్జిబిషన్ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. భారతదేశ అతి ప్రాచీన నేత విధానానికి చెందిన ‘కేశ్’ చీరలు, పశ్చిమ బెంగాల్ గ్రామీణ చేనేత మహిళల సృజనాత్మకతకు ప్రతీకలైన ‘కాంత’ చీరలు మొదలైనవాటిని ఈ ప్రదర్శనలో సొంతం చేసుకోవచ్చని వారు తెలిపారు.
పూజాగదుల్లో ప్రత్యేకంగా వినియోగించే బంగారు గడ్డి చాపలు, నారతో రూపొందించిన చేతి సంచులు, వివిధ రకాల రంగు రాళ్లతో తయారు చేసిన ఆభరణాలు ప్రదర్శనలో ఆకట్టుకుంటున్నాయి. ఎగ్జిబిషన్ ద్వారా వచ్చిన ఆదాయంలో కొంత మొత్తాన్ని దివ్యాంగుల సంక్షేమం కోసం వెచ్చిస్తున్నారు. భారతీయ సంప్రదాయ నేత చీరలను దక్కించుకోవడంతో పాటు.. గ్రామీణ పేద మహిళలు, ప్రత్యేక అవసరాలున్నవారికి అండగా నిలబడే అవకాశం కల్పిస్తున్న ఈ ఎగ్జిబిషన్కు ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తారని ఆశిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
చేనేత వర్గానికి చెందిన పేద మహిళలకు చేయూత అందించాలనే ఉద్దేశంతో ‘స్వయంభర్ నారీ’ సంస్థను 1988లో ప్రారంభించారు. వారి నేత చీరలకు దేశీయంగా మార్కెట్ సౌకర్యం కల్పిస్తూ దోహదపడుతున్నారు. ప్రస్తుతం ఇందులో నేతపనికి చెందిన పురుషులు కూడా సభ్యులుగా ఉన్నారు. వీరందరికీ నేతపనిలో ఆధునిక సాంకేతికతకు సంబంధించిన శిక్షణ కూడా అందిస్తున్నారు.
ఒడిస్సీ నృత్యకారిణి నయనతార నందకుమార్ శుక్రవారం (ఆగస్టు 18) ఈ హస్తకళా ప్రదర్శనను ప్రారంభించారు. వారం రోజుల పాటు ఉదయం 10 గంటల నుంచి 8 గంటల వరకు ఈ ఎగ్జిబిషన్ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. భారతదేశ అతి ప్రాచీన నేత విధానానికి చెందిన ‘కేశ్’ చీరలు, పశ్చిమ బెంగాల్ గ్రామీణ చేనేత మహిళల సృజనాత్మకతకు ప్రతీకలైన ‘కాంత’ చీరలు మొదలైనవాటిని ఈ ప్రదర్శనలో సొంతం చేసుకోవచ్చని వారు తెలిపారు.
పూజాగదుల్లో ప్రత్యేకంగా వినియోగించే బంగారు గడ్డి చాపలు, నారతో రూపొందించిన చేతి సంచులు, వివిధ రకాల రంగు రాళ్లతో తయారు చేసిన ఆభరణాలు ప్రదర్శనలో ఆకట్టుకుంటున్నాయి. ఎగ్జిబిషన్ ద్వారా వచ్చిన ఆదాయంలో కొంత మొత్తాన్ని దివ్యాంగుల సంక్షేమం కోసం వెచ్చిస్తున్నారు. భారతీయ సంప్రదాయ నేత చీరలను దక్కించుకోవడంతో పాటు.. గ్రామీణ పేద మహిళలు, ప్రత్యేక అవసరాలున్నవారికి అండగా నిలబడే అవకాశం కల్పిస్తున్న ఈ ఎగ్జిబిషన్కు ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తారని ఆశిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
చేనేత వర్గానికి చెందిన పేద మహిళలకు చేయూత అందించాలనే ఉద్దేశంతో ‘స్వయంభర్ నారీ’ సంస్థను 1988లో ప్రారంభించారు. వారి నేత చీరలకు దేశీయంగా మార్కెట్ సౌకర్యం కల్పిస్తూ దోహదపడుతున్నారు. ప్రస్తుతం ఇందులో నేతపనికి చెందిన పురుషులు కూడా సభ్యులుగా ఉన్నారు. వీరందరికీ నేతపనిలో ఆధునిక సాంకేతికతకు సంబంధించిన శిక్షణ కూడా అందిస్తున్నారు.