యాప్నగరం

స్వైన్ ఫ్లూతో మూడేళ్ల బాలుడు మృతి

హైదరాబాద్ ను స్వైన్‌ ఫ్లూ మహమ్మారి వణికిస్తోంది.

Samayam Telugu 17 Apr 2017, 4:54 pm
హైదరాబాద్ ను స్వైన్‌ ఫ్లూ మహమ్మారి వణికిస్తోంది. సికింద్రాబాద్-గాంధీ ఆస్పత్రి లో స్వైన్ ఫ్లూ తో మూడేళ్ల బాలుడు సోమవారం మృతిచెందాడు. ముషీరాబాద్ లోని గాంధీ నగర్ కు చెందిన బాలుడు( 3)స్వైన్ ఫ్లూ తో ఈ నెల 4న గాంధీ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ ఈ రోజు మరణించాడు.
Samayam Telugu swine flu terror 3 year old boy dies in hyderabad
స్వైన్ ఫ్లూతో మూడేళ్ల బాలుడు మృతి


ఇదే ఆస్పత్రి లో మరో ఇద్దరు చిన్నారులు స్వైన్ ఫ్లూ తో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. ఈ యేడాది జనవరి నుంచి గాంధీ ఆస్పత్రి లో స్వైన్ ఫ్లూ తో మృతి చెందిన వారి సంఖ్య 22 కు చేరిందని వైద్యులు తెలిపారు. ఎండాకాలంలోనూ స్వైన్ ఫ్లూ వ్యాపిస్తుడటం తో చిన్నారుల తల్లిదండ్రులు, వైద్యులు భయాందోళనకు గురవుతున్నారు.

పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పిల్లల ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.