యాప్నగరం

డ్రంకన్‌ డ్రైవ్‌లో పట్టుబడ్డ కాంగ్రెస్ నేత కుమారుడు

తెలంగాణ కాంగ్రెస్ (టీకాంగ్రెస్) సీనియర్‌ నేత మల్లు రవి కుమారుడు సిద్ధార్థ్ డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో పోలీసులకు చిక్కాడు. శుక్రవారం (ఆగస్టు 10) రాత్రి మద్యం సేవించి కారు నడుపుతుండగా ట్రాఫిక్ పోలీసులు అతడి కారును సీజ్‌ చేశారు.

Samayam Telugu 11 Aug 2018, 3:36 pm
తెలంగాణ కాంగ్రెస్ (టీకాంగ్రెస్) సీనియర్‌ నేత మల్లు రవి కుమారుడు సిద్ధార్థ్ డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో పోలీసులకు చిక్కాడు. శుక్రవారం (ఆగస్టు 10) రాత్రి మద్యం సేవించి కారు నడుపుతుండగా ట్రాఫిక్ పోలీసులు అతడి కారును సీజ్‌ చేశారు. నగరంలోని జూబ్లీహిల్స్‌లో నిర్వహించిన డ్రంకన్ డ్రైవ్‌ తనిఖీల్లో అతడు పట్టుబట్టాడు. ట్రాఫిక్ పోలీసులు డ్రంకన్‌ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తుండగా అదే సమయంలో సిద్ధార్థ్‌ టీఎస్‌ 09 ఈఆర్ 7777 నంబర్‌ కారులో వచ్చాడు. ట్రాఫిక్ పోలీసులు అతడి వాహనాన్ని నిలిపి బ్రీత్‌ అనలైజర్‌తో పరీక్షించగా.. సిద్ధార్థ్‌ మోతాదుకు మించి మద్యం సేవించినట్లు తేలింది.
Samayam Telugu drunk


సిద్ధార్థ్ నడుపుతున్న కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు జూబ్లీహిల్స్ పోలీసుస్టేషన్‌కు తరలించారు. అతడిపై కేసు నమోదు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.