యాప్నగరం

ప్రాజెక్టుల అధ్యయనం కోసం టి.జేఏసీ యాక్షన్ ప్లాన్

హైదరాబాద్: కోదండరాం అధ్యక్షతన తెలంగాణ జాయింట్ కమిటీ సమావేశమైంది.

TNN 14 Jul 2016, 2:27 pm
తెలంగాణలో చేపడుతున్న ప్రాజెక్టులపై తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యయనం చేసే పనిలో పడింది. ఈ నేపథ్యంలో ప్రొఫెసర్ కోదండరాం అధ్యక్షతన నాంపల్లిలోని జేఏసీ కార్యాలయంలో గురువారం స్టీరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రాజెక్టుల నిర్మాణం, అందులో ఉన్న లోపాలపై టి.జేఏసీ సుధీర్ఘంగా చర్చ జరిగింది. ఇందులో ప్రధానంగా భూసేకరణ అంశంపై లోతుగా చర్చించారు. క్షేత్ర స్థాయిలో పర్యటించి ప్రాజెక్టులను అధ్యయనం చేయాలని టి.జేఏసీ నిర్ణయం తీసుకుంది. తమ కార్యచరణలో భాగంగా ఈ నెల 21,22 తేదీల్లో మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రాజెక్టులను పరిశీలించాలని షెడ్యూల్ రెడీ చేసుకున్నారు.
Samayam Telugu t jac action plan on projects issue
ప్రాజెక్టుల అధ్యయనం కోసం టి.జేఏసీ యాక్షన్ ప్లాన్


ప్రాజెక్టుల రీడిజైన్, కొత్తగా చేపడుతున్న ప్రాజెక్టులపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. దీంతో పాటు భూసేకరణ వల్ల నిర్వాతుల్లో ఆందోళన నెలకొన్న నేపథ్యంలో కోదండరం అధ్వర్యంలో టిజేఏసీ ప్రాజెక్టుల అధ్యయనానికి శ్రీకారం చుట్టింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.