యాప్నగరం

Jaganకు కొత్త తలనొప్పి.. ఎమ్మెల్యే, ఎంపీ మధ్య విబేధాలు.. కలిసి పోటీ చేసి అంతలోనే..

Guntur| వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే, ఎంపీ అనుచరుల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరాయి. తన నియోజకవర్గ వ్యవహారాల్లో ఎంపీ తలదూరుస్తున్నారని ఆరోపిస్తూ ఎమ్మెల్యే సీఎంకు ఫిర్యాదు చేశారు.

Samayam Telugu 17 Jul 2019, 7:21 pm
ఏపీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చిన జగన్‌కు రాజధాని నేతల వ్యవహారం తలనొప్పిగా మారింది. అధికారంలోకి వచ్చి నెలన్నర గడిచిందో లేదో.. అధికార పార్టీ నేతల మధ్య పొసగడం లేదు. గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, బాపట్ల ఎంపీ నందిగం సురేశ్ మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరింది. ఎన్నికల సమయంలో శ్రీదేవి, సురేశ్ ఐక్యంగా ప్రచారం చేశారు. ఒకే సామాజిక వర్గానికి చెందిన వీరిద్దరూ ఒకరి విజయం కోసం మరొకరు కృషి చేశారు. కానీ ఇదంతా మూణ్నాళ్ల ముచ్చగానే మిగిలిపోయింది.
Samayam Telugu suresh sridevi.


కొద్ది రోజులుగా ఎమ్మెల్యే, ఎంపీ అనుచరుల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఇటీవలే ఫ్లెక్సీ వివాదంలో ఇద్దరు నేతల అనుచరులు ఘర్షణకు దిగారు. ఫ్లెక్సీల్లో ఎంపీ ఫోటో చిన్నదిగా, ఎమ్మెల్యే ఫోటో పెద్దదిగా వేశారని నందిగం వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ఫోటో వేసిన వ్యక్తిని బెదిరించారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఎమ్మెల్యే అనుచరులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజాగా ఇసుక వ్యవహారంలోనూ ఈ ఇద్దరి అనుచరుల మధ్య గొడవలు మొదలయ్యాయి. గుంటూరు లోక్‌సభ స్థానం పరిధిలోకి వచ్చే తన నియోజకవర్గ వ్యవహారాల్లో బాపట్ల ఎంపీ తలదూరుస్తున్నారని, ఇసుక అక్రమ తవ్వకాలను ప్రోత్సహిస్తున్నారని ఎమ్మెల్యే సీఎం జగన్‌కు ఫిర్యాదు చేశారు.

రాజధాని భూసేకరణకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో నందిగం సురేశ్ కీలక పాత్ర పోషించారు. రాజధానిలో వైఎస్ఆర్సీపీ తరఫున గళం వినిపించిన సురేశ్.. జగన్‌ అభిమానం చురగొన్నారు. దీంతో పార్టీలోని ఇతర నేతలు వారించినప్పటికీ.. ఏరికోరి మరీ జగన్ సురేశ్‌కు ఎంపీ టికెట్ ఇచ్చారు. ఎన్నికల్లో ఆయన ఖర్చంతా పార్టీనే భరించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.