యాప్నగరం

అందుకే సినిమావాళ్లపై ఎక్కువ ఫోకస్: తలసాని

" కేవలం సినీ ప్రముఖులని మాత్రమే లక్ష్యంగా చేసుకుని తెలంగాణ ప్రభుత్వం ఈ డ్రగ్స్ కేసు విచారణ చేపడుతోందని....

TNN 27 Jul 2017, 6:36 pm
" కేవలం సినీ ప్రముఖులని మాత్రమే లక్ష్యంగా చేసుకుని తెలంగాణ ప్రభుత్వం ఈ డ్రగ్స్ కేసు విచారణ చేపడుతోందని వస్తున్న ఆరోపణలపై తెలంగాణ సినిమాటోగ్రఫీశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. సినీ ప్రముఖులకి వుండే ఫ్యాన్ ఫాలోయింగ్, గుర్తింపు, ఇమేజ్ కారణంగానే టీవీ ఛానెళ్లు, న్యూస్ మీడియా వారికి ఎక్కువ కవరేజ్ ఇస్తోంది. అలా కాకుండా, ఒకవేళ ఎవ్వరికీ తెలియని వ్యక్తులని విచారణకి పిలిచి వుంటే అప్పుడు మీడియా కూడా వారిని పట్టించుకునేది కాదు. ఇక్కడ సాధారణ వ్యక్తులకి, సినిమా వాళ్లకి మధ్య వున్న తేడా అదే. అంతకుమించి ఇందులో అనుకోవడానికి ఇంకేమీ లేదు" అని అన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.
Samayam Telugu talasani srinivas yadav reacts to rumours about drugs racket case
అందుకే సినిమావాళ్లపై ఎక్కువ ఫోకస్: తలసాని


" ఈ డ్రగ్స్ రాకెట్ కేసులో సిట్ అధికారులు వారికి వున్న అనుమానాలని వివృత్తి చేసుకునేందుకే కొంతమంది సినీ ప్రముఖులకి నోటీసులు ఇచ్చి విచారణకి పిలిపించారు. విచారణకి రమ్మని పిలిచినంత మాత్రాన్నే వాళ్లు తప్పు చేశారని కాదు, ముద్దాయిలని కాదు. అలా అని ప్రభుత్వం కూడా అనడం లేదు" అని మంత్రి తలసాని స్పష్టంచేశారు. సినీ ప్రముఖులనే విచారణకి పిలవడంపై వచ్చిన ఆరోపణలపై స్పందించే క్రమంలో గురువారం మధ్యాహ్నం ఓ ఛానెల్‌తో మాట్లాడుతూ తలసాని ఈ వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ ప్రభుత్వం టాలీవుడ్‌ని టార్గెట్ చేసుకుందా అని వస్తున్న ఆరోపణలపై తరచుగా ప్రభుత్వ ప్రతినిధులు ఎవరో ఒకరు వివరణ ఇస్తూనే వున్నప్పటికీ.. ఆ ఆరోపణలకి మాత్రం ఫుల్‌స్టాప్ పడటం లేదు. ఇప్పుడు ఏకంగా తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రినే దీనిపై స్పందించారు. మరి ఇకనైనా ఈ రూమర్స్ తెర మరుగవుతాయోమో చూద్దాం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.