యాప్నగరం

కాంగ్రెస్ మ్యానిఫెస్టోతో ఓరిగేదేమీ లేదు: తలసాని

త‌ల‌కిందుల త‌పస్సు చేసినా కాంగ్రెస్ పార్టీకి ఓట‌మి త‌ప్ప‌ద‌ని, మ్యానిఫెస్టోల‌తో ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెట్ట‌లేర‌ని అన్నారు త‌ల‌సాని. కాంగ్రెస్ గ‌తంలో 45 ఏళ్ల పాటు పాలించింద‌ని వారిని ప్ర‌జ‌లు ఎలా నమ్ముతారంటూ ప్ర‌శ్నించారు.

Samayam Telugu 6 Sep 2018, 1:16 pm
కాంగ్రెస్ మ్యానిఫెస్టోతో ఓరిగేదేమీ లేదన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్. తెలంగాణకు టీఆర్‌ఎస్‌ పార్టీనే శ్రీరామరక్ష అని ప్రజలు నమ్ముతున్నారని తెలిపారు. సికింద్రాబాద్‌లోని మారేడుపల్లి, రాంగోపాలపేట డివిజన్ లో పలు అభివృద్ది కార్యక్రమాలను పరిశీలించిన మంత్రి.. పనులు త్వరితగతిన పూర్తయ్యే విధంగా చుడాలని అధికారులను ఆదేశించారు.
Samayam Telugu talasani on congress


కాంగ్రెస్ పార్టీ వాళ్లు చేయ‌లేని, అమ‌లుచేయ వీలుకాని హామీలతో ఎంత ప్రయత్నించినా.. కనీసం ఓటు వేసే వారే లేని ఆయన ఎద్దెవ చేశారు. తలకిందులుగా తపస్సు చేసినా వారికి ఓటమి తప్పదని, మానిఫెస్టోలతో కొత్త పార్టీలు ప్రకటించాలి కానీ.. 45 ఏళ్ల దరిద్రపు పాలన చేసిన కాంగ్రెస్ ను ప్రజలు ఎలా నమ్ముతారంటూ మండిపడ్డారు. ఆయన.. సీఎం కేసీఆర్ ప్రతి పథకంను ఆలోచించి నిర్ణయం తీసుకుంటారన్నారు. వాటిని విజయవంతంగా ముందుకు నడుపుతున్నారని వివరించారు. కాంగ్రెస్‌ ఇలాంటి పథకాలు పది ప్రవేశపెట్టినా ఓట్లు మాత్రం రావని ఆయన స్పష్టం చేశారు. అభివృద్ది కార్యక్రమల్లో మంత్రితో పాటు ఎమ్మెల్యే సాయన్న, కార్పొరేటర్లు పాల్గొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.