యాప్నగరం

తెలంగాణ వాదన నెగ్గింది.. పన్నులు తగ్గాయి

జీఎస్టీపై నెలకొన్న భయాలు, సందేహాలు కేంద్ర ప్రభుత్వ సానుకూల వైఖరి వల్ల ఇప్పుడిప్పుడే తొలిగిపోతున్నాయని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఇది శుభ పరిణామమని ఆయన చెప్పారు. చాలా రకాల వస్తు, సేవలపై పన్నును 28% శ్లాబ్‌ నుంచి తొలిగించడం పట్ల ఈటల సంతోషం వ్యక్తం చేశారు.

TNN 11 Nov 2017, 1:40 pm
జీఎస్టీపై నెలకొన్న భయాలు, సందేహాలు కేంద్ర ప్రభుత్వ సానుకూల వైఖరి వల్ల ఇప్పుడిప్పుడే తొలిగిపోతున్నాయని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఇది శుభ పరిణామమని ఆయన చెప్పారు. చాలా రకాల వస్తు, సేవలపై పన్నును 28% శ్లాబ్‌ నుంచి తొలిగించడం పట్ల ఈటల సంతోషం వ్యక్తం చేశారు. ఫిట్‌మెంట్ కమిటీ కేవలం 62 రకాల వస్తువులు, సేవలపై పన్ను తగ్గించాలని సిఫారసు చేయగా.. జీఎస్టీ మండలి 177 వస్తువులపై పన్ను తగ్గించడం విశేషం అన్నారు. దీంతో సామాన్య ప్రజలకు వస్తువుల ధరలు, సేవలు మరింత అందుబాటులోకి వస్తాయని చెప్పారు. అసోంలోని గౌహతిలో శుక్రవారం (నవంబర్ 10) జరిగిన జీఎస్టీ కౌన్సిల్ 23వ సమావేశానికి హాజరైన ఈటల.. సమావేశ నిర్ణయాలు వినియోగదారులకు ఊరటనిచ్చేవిగా ఉన్నాయని చెప్పారు.
Samayam Telugu tax on 178 items moving to 18 is a good sign says etela rajender
తెలంగాణ వాదన నెగ్గింది.. పన్నులు తగ్గాయి


‘పలు రకాల వస్తువులు, సేవలపై పన్నులను తగ్గించాలని తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలు కేంద్రంపై తెచ్చిన ఒత్తిడి ఫలించింది. ఈ క్రమంలోనే గ్రానైట్‌పై పన్ను భారం తగ్గింది. ప్రతి ఒక్కరు పన్నులు చెల్లించేలా ఆచరణాత్మక పన్ను విధానం ఉండాలి. ఎగవేసే విధంగా భారం ఉండకూడదని మేం మొదటి నుంచి చేస్తున్న సూచనను కౌన్సిల్ పరిగణనలోకి తీసుకోవడం సంతోషంగా ఉంది’ అని ఈటల అన్నారు.

కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న మంత్రి ఈటల.. పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. రాష్ట్ర డిమాండ్లను మరోసారి ప్రస్తావించారు. తెలంగాణలో చాలామంది బీడీలు చుట్టడంపై ఆధారపడి జీవిస్తున్నారని, బీడీలపై జీఎస్టీని తగ్గించాలని కోరారు. గ్రానైట్ కూడా తెలంగాణలో పెద్ద పరిశ్రమని, దానిపై చాలామంది ఆధారపడి ఉన్నారని చెప్పారు. పన్ను తగ్గించి గ్రానైట్ పరిశ్రమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

చేనేత, వ్యవసాయ రంగాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్న క్రమంలో వ్యవసాయ పరికరాలు, హస్తకళలకు అవసరమైన పరికరాలపై పన్నులను కనిష్ట స్థాయికి తగ్గించాలని ఈటల సూచించారు. సమావేశంలో గ్రానైట్ పరిశ్రమపై ప్రస్తుతం ఉన్న 28% పన్నును 18 శాతానికి తగ్గించడం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.

కొన్నింటిని మినహాయించి అన్ని రకాల హోటళ్లను 5% శ్లాబ్‌లోకి తీసుకురావడం వినియోగదారులకు మేలు చేస్తుందని ఈటల పేర్కొన్నారు. జీఎస్టీ పరిధిలోకి రియల్‌ ఎస్టేట్ రంగాన్ని తీసుకురావడం తగదని జీఎస్టీ కౌన్సిల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు రాష్ట్ర అధికారులు తెలిపారు. వచ్చే సమావేశంలో దీనిపై చర్చ ఉండవచ్చని వారన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.