యాప్నగరం

నంద్యాల తొలి రౌండ్.. టీడీపీదే!

ఫస్ట్ రౌండ్ కౌంటింగ్ వివరాలు ఇలా ఉన్నాయి..

TNN 28 Aug 2017, 8:48 am
నంద్యాల ఉప ఎన్నిక కౌంటింగ్ లో ఫస్ట్ రౌండ్ రిజల్ట్ వెల్లడి అయ్యింది. మొత్తం 19 రౌండ్ల కౌంటింగ్ ఫస్ట్ రౌండ్ లో తెలుగుదేశం పార్టీ మెజారిటీ సాధించింది. టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానంద రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డిపై 1,295 ఓట్ల ఆధిక్యాన్ని సాధించాడు.
Samayam Telugu tdp candidate leads in nandyal
నంద్యాల తొలి రౌండ్.. టీడీపీదే!


తొలి రౌండ్ లో భూమా బ్రహ్మానంద రెడ్డికి 5,474 ఓట్లు లభించగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్పాకు 4,179 ఓట్లు వచ్చాయి. దీంతో ఫస్ట్ రౌండ్ లో తెలుగుదేశం అభ్యర్థికి స్పష్టమైన ఆధిక్యం లభించినట్టు అయ్యింది. తొలి రౌండ్లో కాంగ్రెస్ అభ్యర్థి69 ఓట్లకు పరిమితం అయ్యాడు. తొలి రౌండ్లలో రూరల్ ఓట్లు, తదుపరి రౌండ్లలో అర్బన్ ఓట్ల కౌంటింగ్ జరగనుంది.

ఇక పోస్టల్ బ్యాలెట్స్ లో ఇరు పార్టీలకూ ఎలాంటి ఓట్లూ లభించలేదు. మొత్తం 39 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదవ్వగా వాటిలో ఒక్కటి కూడా చెల్లలేదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.