యాప్నగరం

YS Jagan తండ్రి బాటలోనే నడుస్తున్నారు.. చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

ముఖ్యమంత్రి జగన్ తండ్రి బాటలోనే నడుస్తున్నారంటూ చంద్రబాబు వ్యాఖ్యలు. టీడీపీ నేతలతో టెలీ కాన్ఫరెన్స్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన తెలుగుదేశం పార్టీ అధినేత.

Samayam Telugu 16 Jul 2019, 11:06 am
ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు సీఎం వైఎస్ జగన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడిన బాబు.. పోలవరం, పట్టిసీమలపై వైసీపీ చేస్తున్న విమర్శలపై స్పందించారు. పోలవరం ప్రాజెక్ట్‌‌ విషయంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో ప్రస్తావించిన అంశాలను చంద్రబాబు గుర్తుచేశారు. విజయసాయి సీబీఐ ఎంక్వైరీ అడిగితే.. అవసరం లేదన్నట్లు కేంద్ర మంత్రి చెప్పారని గుర్తు చేశారు. పునరావాసంలో అవకతవకల గురించి జీవీఎల్ ప్రస్తావిస్తే.. పోలవరానికి ఎంత ఇస్తారని రమేష్ అడిగారన్నారట.
Samayam Telugu babu


పోలవరానికి ఫైనాన్స్ క్లియరెన్స్ రాలేదన్నారట చంద్రబాబు. ఆర్ అండ్ ఆర్ రాష్ట్ర పరిధిలోనిదేనని కేంద్రం అంటోందని.. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం.. వైసీపీ ఎందుకు మాట్లాడటం లేదో అర్ధం కావడం లేదన్నారట. కియా పరిశ్రమను వైఎస్ తెచ్చారని.. పట్టిసీమ నీళ్లు మచిలీపట్నానికే ఉపయోగ పడలేదని.. గోదావరికే కృష్ణా నీళ్లు తీసుకెళ్లినట్టు వైసీపీ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారట.

ఇక టీడీపీ నేతలతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. తాజా రాజకీయాలు, అసెంబ్లీ సమావేశాలపై చర్చించారు. కియా కార్ల కంపెనీని వైఎస్ తెచ్చారని వైసీపీ అబద్దాలు చెబుతోందని టీడీపీ అధినేత మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో ప్రాజెక్టులు ఆగిపోయాయని.. పీపీఏలపై బురద జల్లాలనే ప్రయత్నం బెడిసికొట్టిందన్నారు.రాజధాని అమరావతిని అప్రతిష్ట పాలు చేస్తున్నారని.. సున్నా వడ్డీకి రుణాల విషయంలో టీడీపీని ఇరుకున పెట్టాలని చూశారని.. ఆధారాలతో సహా బయటపెట్టేసరికి ప్లేట్ ఫిరాయించారని బాబు వ్యాఖ్యానించారట.

టీడీపీ హయాంలో అవినీతి అంటూ వైసీపీ చేస్తోన్న ప్రచారంపైనా చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ హాయంలో తనపై 26 విచారణలు జరిపించారని.. ఒక్క ఆరోపణ రుజువు చేయలేకపోయారని గుర్తుచేశారు. రాజకీయ కక్ష సాధింపునకు కోర్టును వేదికగా చేసుకున్నారని.. గతంలోనే జడ్జిలు అక్షింతలు వేశారని.. ఇప్పుడు జగన్‌ మళ్లీ అదే బాటలో నడుస్తున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అర్ధంలేని అవినీతి ఆరోపణలతో టైమ్ వేస్ట్ చేస్తున్నారని అభిప్రాయపడ్డారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.