యాప్నగరం

ఆమె పార్ట్‌ టైం ఎమ్మెల్యే.. రోజాకు టీడీపీ కౌంటర్

దాచేపల్లి ఘటనపై టీడీపీ వర్సెస్ వైసీపీ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. ఘటనను నిరసిస్తూ వైసీపీ ఎమ్మెల్యే రోజా గుంటూరు జీజీహెచ్ ముందు ధర్నాకు దిగడంతో ఉద్రిక్తత ఏర్పడింది.

Samayam Telugu 4 May 2018, 1:05 pm
దాచేపల్లి ఘటనపై టీడీపీ వర్సెస్ వైసీపీ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. ఘటనను నిరసిస్తూ వైసీపీ ఎమ్మెల్యే రోజా గుంటూరు జీజీహెచ్ ముందు ధర్నాకు దిగడంతో ఉద్రిక్తత ఏర్పడింది. ఈ ఆందోళనపై టీడీపీ మండిపడింది. రోజా పార్ట్‌ టైం ఎమ్మెల్యే అంటూ హోంమంత్రి చినరాజప్ప విమర్శించారు. ఇలాంటి ఘటనల్ని కూడా రాజకీయం చేయాలనుకోవడం దారుణమన్నారు. బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉందని... నిందితుడి కోసం స్పెషల్ టీమ్‌లు గాలిస్తున్నాయన్నారు. సుబ్బయ్య గురించి ఎవరైనా సమాచారం ఇస్తే... బహుమానం ఇస్తామని ప్రకటించారు.
Samayam Telugu Roja..


అత్యాచార ఘటనను కూడా రాజకీయం చేయడం సిగ్గుచేటని గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా మానవత్వంతో చూడాలని... నిందితుడు ఎవరైనా అరెస్ట్ చేసి ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తుందన్నారు. ఈ ఘటనను సీఎం చంద్రబాబు కూడా సీరియస్‌గా తీసుకున్నారని... బాధితురాలికి సర్కార్‌తో పాటూ స్థానిక ఎమ్మెల్యేగా తాను అండగా ఉంటానని చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.