యాప్నగరం

ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు,ఇరకాటంలో టీడీపీ!

ఇటీవలే దళిత తేజం- తెలుగుదేశం అంటూ ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు.

TNN 5 Mar 2018, 11:22 am
ఇటీవలే దళిత తేజం- తెలుగుదేశం అంటూ ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. దళిత ఓటు బ్యాంకును లక్ష్యంగా చేసుకుని తెలుగుదేశం పార్టీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఆ కార్యక్రమం అలా ముగిసిందో లేదో కానీ.. ఇప్పుడు తెలుగుదేశం ఎమ్మెల్యే, మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు చేసిన వ్యాఖ్యానాలు సంచలనంగా మారాయి. పార్టీలో దళితుల పరిస్థితి ఏమీ బాగోలేదని అంటూ..సంచలన వ్యాఖ్యలు చేశారు రావెల.
Samayam Telugu tdp dalit leades facing bad situation ravela
ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు,ఇరకాటంలో టీడీపీ!


నియోజకవర్గాల వారీగా పరిస్థితిని ప్రస్తావించారీయన. ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గాల్లో పెత్తనం అంతా దళితేతర నేతలదే అని రావెల అంటున్నారు. తెలుగుదేశం పార్టీలో ఈ పరిస్థితి ఉందని ఆయన ధ్వజమెత్తారు. ఇటీవలే నియోజకవర్గంలో తనను డమ్మీ చేసేశారని కర్నూలు జిల్లా కొడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీ పేరును కూడా రావెల ప్రస్తావించారు. అక్కడ విష్ణువర్ధన్ రెడ్డి పెత్తనం కొనసాగుతోందని, నియోజకవర్గం టీడీపీ ఇన్ చార్జిగా ఆయనే ఉన్నారని రావెల అంటున్నారు.

ఇక కొవ్వూరు ఎమ్మెల్యే జవహర్ మంత్రిగా ఉన్నప్పటికీ నియోజకవర్గంలో మాత్రం పెత్తనం సుబ్బరాజు చౌదరిది అని అన్నారు. ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గాలు అయిన గోపాల పురం, వేమూరు, కొండెపిల్లో కూడా ఇదే పరిస్థితి ఉందన్నారు. ఇక్కడ టీడీపీ తరఫు దళిత ఎమ్మెల్యేలు ఉన్నా.. పెత్తనం మాత్రం వేరే కులస్తులైన నేతలదే అని, పార్టీ ఇన్ చార్జిలుగా వారే కొనసాగుతూ ఉన్నారని, పవర్ మొత్తం వారి చేతుల్లోనే ఉంటోందని రావెల చెప్పుకొచ్చారు.

దళితులైన ఎమ్మెల్యేలను నామమాత్రంగా మార్చి.. అగ్ర కులాల నేతలు జులుం చలాయిస్తున్నారని.. సొంత పార్టీనే లక్ష్యంగా చేసుకుని రావెల ఈ వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీని ఇరకాటంలో పెడుతున్నాయి ఈ మాజీ మంత్రిగారి వ్యాఖ్యలు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.