యాప్నగరం

పవన్ కల్యాణ్‌పై టీడీపీ ఎదురుదాడి

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై తెలుగు దేశం పార్టీ ఎదురుదాడికి దిగింది.

TNN 8 May 2017, 1:53 pm
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై తెలుగు దేశం పార్టీ ఎదురుదాడికి దిగింది. టీటీడీ ఈవో పదవిలో ఓ ఉత్తరాది ఐఏఎస్ అధికారిని కూర్చోబెట్టడాన్ని తప్పుబడుతూ పవన్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. పవన్ ట్విట్టర్ ద్వారా చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు వర్ల రామయ్య, రాజేంద్ర ప్రసాద్ స్పందించారు. సింఘాల్ టీటీడీ ఈవోగా ఉంటే తప్పేంటని వర్ల రామయ్య పవన్‌ను ప్రశ్నించారు. సోమవారం విజయవాడలో మాట్లాడుతూ.. తెలుగువాడైన వీరయ్యచౌదరి కేంద్ర విజిలెన్స్ కమిషనర్‌గా ఉన్నారని గుర్తుచేశారు.
Samayam Telugu tdp fires on pawan kalyan tweet against ttd eo appointment
పవన్ కల్యాణ్‌పై టీడీపీ ఎదురుదాడి


గత ఎన్నికల్లో తమకు మద్దతు ఇచ్చినంత మాత్రాన, ప్రజల్లో కనపడాలని ఇలాంటి స్టేట్‌మెంట్లు ఇవ్వడం తగదని రామయ్య అన్నారు. ఓ దక్షిణ భారతీయుడు దేశానికి ప్రధాన మంత్రి కాలేదా? సంజీవయ్య రెడ్డి దేశానికి రాష్ట్రపతి కాలేదా? అని రామయ్య ప్రశ్నించారు. తితిదే ఈవో పదవి కేవలం దక్షిణ భారతీయులదే అని చట్టంలో ఎక్కడా లేదని అన్నారు. ఉత్తర, దక్షిణ భారతదేశమంటూ దేశ ప్రజలను విడదీయొద్దంటూ రామయ్య పవన్‌కు విజ్ఞప్తి చేశారు. సమర్థుడైన అనిల్ కుమార్ సింఘాల్‌ను టిటిడీ ఈవోగా నియమించారని, ఆయన వ్యవహార శైలిని కూడా ఒకసారి చూద్దామని చెప్పారు.

మరోవైపు టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ కూడా ఈ విషయంపై స్పందించారు. పవన్ కల్యాణ్ గమనించకో లేక ఆవేశంలో ఈ వ్యాఖ్యలు చేసినట్టున్నారని రాజేంద్రప్రసాద్ అభిప్రయపడ్డారు. ఐఏఎస్ చదివినవారికి దేశంలో ఎక్కడైనా పనిచేసే అర్హత, బాధ్యత, హక్కు, అధికారం ఉన్నాయన్నారు. పవన్ కల్యాణ్‌కు ఎవరో తప్పుడు సలహాలు ఇస్తున్నారని చెప్పారు. ఐఏఎస్‌లకు కులం, మతం, ప్రాంతం అనే తేడాలుండవన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.