యాప్నగరం

​పవన్ కల్యాణ్ పై టీడీపీ వ్యూహాత్మక మౌనం!

తెలుగుదేశం పార్టీ ఎంపీల తీరును తప్పుపట్టారు పవన్ కల్యాణ్. రాజ్యసభలో హోదాపై చర్చ జరిగిన వేళ తెలుగుదేశం ఎంపీలు మారు మాట్లాడలేదని

TNN 14 Apr 2017, 11:46 am
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా పోరాటం విషయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన ట్వీట్ల పట్ల తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తున్నట్టుగా ఉంది. ప్రత్యేకహోదాపై రాజ్యసభలో జరిగిన చర్చను ఉద్దేశించి పవన్ కల్యాణ్ ట్వీట్లు చేసిన సంగతి తెలిసిందే. ఆ ట్వీట్లలో తెలుగుదేశం పార్టీ ఎంపీల తీరును తప్పుపట్టారు పవన్ కల్యాణ్. రాజ్యసభలో హోదాపై చర్చ జరిగిన వేళ తెలుగుదేశం ఎంపీలు మారు మాట్లాడలేదని, ఆ సమయంలో సభలోనే ఉండిన కేందమంత్రి అశోక్ గజపతి రాజు కూడా మౌనం వహించడం ఏమిటని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.
Samayam Telugu tdp keep calm on pk tweets
​పవన్ కల్యాణ్ పై టీడీపీ వ్యూహాత్మక మౌనం!


హోదాపై చర్చ విషయంలో తెలుగుదేశం ఎంపీల తీరును తప్పుపట్టిన పవన్ కల్యాణ్ ఇదే సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల తీరును, ఏపీకి ప్రత్యేకహోదా కావాలన్న తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎంపీలను మెచ్చుకున్నారు. వారిని అభినందించారు. మరి పవన్ ట్వీట్లు తెలుగుదేశం పార్టీ ఒకింత ఇరకాటంలో పెట్టేవే. ఏపీకి ప్రత్యేక హోదా అనేది తెలుగుదేశం పార్టీ, బీజేపీల ఎన్నికల హామీల్లో ఒకటి. అయితే ఇప్పుడు మాత్రం హోదా అక్కర్లేదు, రాదు అని ఆ పార్టీ లు అంటున్నాయి.

ఈ నేపథ్యంలో ఈ తీరు గురించి తమపై వస్తున్న విమర్శలపై తెలుగుదేశం సహజంగానే ఎదురుదాడి చేయాలి. వేరే ఎవరైనా ఇలాంటి విమర్శలు చేసి ఉంటే తెలుగుదేశం పార్టీ తీవ్రమైన ఎదురుదాడే చేసేది. అయితే.. ఇప్పుడు విమర్శలు చేసింది జనసేనాధినేత పవన్ కల్యాణ్. ఈయనతో తెలుగుదేశం పార్టీ ఇంకా సత్సంబంధాలనే కోరుకుంటోంది. అందుకే.. తమ తీరును విమర్శించినా, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని పవన్ మెచ్చుకున్నా.. టీడీపీ వ్యూహాత్మకంగా మౌనాన్నే పాటిస్తోందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.