యాప్నగరం

ఆస్పత్రిలో ఆనం వివేకానంద రెడ్డి... ఏమైంది?

టీడీపీ నేత ఆనం వివేకానంద రెడ్డి ఆస్పత్రిలో చేరారు. కొద్ది రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన... నెల్లూరులోనే చికిత్స చేయించుకున్నారు. కాని తర్వాత వైద్యుల సూచన మేరకు హైదరాబాద్ తరలించారు. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆయనకు డాక్టర్లు వైద్యాన్ని అందిస్తున్నారు.

TNN 6 Dec 2022, 5:51 pm
టీడీపీ నేత ఆనం వివేకానంద రెడ్డి ఆస్పత్రిలో చేరారు. కొద్ది రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన... నెల్లూరులోనే చికిత్స చేయించుకున్నారు. కాని తర్వాత వైద్యుల సూచన మేరకు హైదరాబాద్ తరలించారు. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆయనకు డాక్టర్లు వైద్యాన్ని అందిస్తున్నారు. ఆనం ఆరోగ్యం నిలకడగా ఉందని... పరిస్థితిని డాక్టర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఆనంను మంత్రి నారా లోకేష్ పరామర్శించారు. ఆయన ఆరోగ్యంపై ఆరా తీసి... కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఆనం వివేకా కొంతకాలంగా బయట కనిపించడం లేదు. పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. అనారోగ్య కారణాలతోనే ఆయన అంతగా బయటకు రావడం లేదని సన్నిహితులు చెబుతున్నారు.
Samayam Telugu Viveka


గతంలో కూడా ఆయన అస్వస్థతకు గురయ్యారు. మళ్లీ ఇప్పుడు ఆస్పత్రిలో చేరడంతో... అనుచరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన త్వరగా కోలుకొని మళ్లీ... జనంలోకి రావాలని ఆకాంక్షిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.