యాప్నగరం

ఎంత దూరమైనా వెళ్తా, మరోసారి ఇలా చేస్తే.. ‘సాక్షి’కి పరిటాల శ్రీరామ్ వార్నింగ్

నా మీద, నా కుటుంబం మీద తప్పుడు వార్తలు రాస్తే పట్టించుకోను. కానీ ప్రజలకు నష్టం జరిగితే మాత్రం ఊరుకోను. ఎంత దూరమైనా వెళ్తానంటూ సాక్షి దినపత్రికకు పరిటాల శ్రీరామ్ వార్నింగ్ ఇచ్చారు.

Samayam Telugu 29 Dec 2018, 3:05 pm

ప్రధానాంశాలు:

* సాక్షి మీడియాకు పరిటాల శ్రీరామ్ వార్నింగ్
* ప్రజలకు నష్టం చేకూర్చేలా తప్పుడు కథనాలు రాయొద్దని హెచ్చరిక
* నిజాలైతే నిరూపించాలని అనంతపురం సాక్షి ఆఫీసు ముందు ఆందోళన.
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu paritala sreeram
జగన్ ఫ్యామిలీకి చెందిన సాక్షి దినపత్రికపై పరిటాల శ్రీరామ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘నా మీదనో నా కుటుంబం మీదనో తప్పుడు రాతలు రాసినా పట్టించుకోను. నాకు నష్టం జరిగినా నేను పెద్దగా తీసుకోను. అదే ప్రజలకు, సమాజానికి నష్టం జరుగుతుంది, ప్రమాదంగా మారుతుందంటే ఏ మాత్రం సహించను. ఎంత దూరమైనా వెళ్తా’నంటూ సాక్షి దినపత్రికకు పరిటాల శ్రీరామ్ హెచ్చరికలు జారీ చేశారు. మంత్రి పరిటాల సునీతపై సాక్షిలో వచ్చిన కథనం పట్ల స్పందిస్తూ పరిటాల శ్రీరామ్ ఈ వ్యాఖ్యలు చేశారు. నిజాలు నిరూపించాలంటూ.. శుక్రవారం అనంతపురంలోని సాక్షి కార్యాలయం ఎదుట అనుచరులతో కలిసి శ్రీరామ్ ఆందోళన చేపట్టారు.
ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ.. ‘సాక్షి పత్రిక పుట్టుకే అవినీతి అక్రమ సంపాదనలతో పుట్టింద’ని తీవ్ర స్థాయిలో విమర్శించారు. ‘అభివృద్ధికి అడ్డంకిగా మారి, తప్పుడు రాతలతో నిందారోపణలతో రెచ్చిపోతే ప్రశాంతంగా ప్రజాస్వామ్య బద్ధంగా నిరసన తెలిపాను. మీరు మరోసారి ఇలా చేస్తే మరో మెట్టు ఎక్కుతా’నంటూ ఆయన సోషల్ మీడియా వేదికగా హెచ్చరించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.