యాప్నగరం

వరదరాజులు రెడ్డి వర్సెస్ సీఎం రమేష్.. ప్రొద్దుటూరు టీడీపీలో కోల్డ్‌వార్

నా ప్రాణం ఉన్నంత వరకు సీఎం రమేష్‌ను నియోజకవర్గంలోకి రానివ్వను.. కౌన్సిలర్ల రాజీనామాకు కారణం ఎవరు..

Samayam Telugu 2 Oct 2018, 9:14 pm
కడప జిల్లా ప్రొద్దుటూరు టీడీపీలో విభేదాలు మళ్లీ భగ్గుమన్నాయి. వరదరాజులు రెడ్డి వర్సెస్ ఎంపీ రమేష్ సీఎం మధ్య మళ్లీ కోల్డ్ వార్ మొదలయ్యింది. నేతలంతా సర్థుకుపోయి.. సమన్వయంతో ముందుకెళ్లమని అధినేత చెప్పినా.. వరదరాజులు రెడ్డి ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. తాజాగా ప్రొద్దుటూరు మున్సిపల్ కౌన్సిలర్ల రాజీనామా వ్యవహారంతో మళ్లీ వేడి రాజుకోగా.. సీఎం రమేష్‌ను టార్గెట్ చేస్తూ వరదరాజులు మళ్లీ ఫైరయ్యారు. నియోజకవర్గంలో ఎంపీని అడుగు పెట్టనిచ్చేది లేదంటూ విరుచుకుపడ్డారు.
Samayam Telugu KadapA


ప్రొద్దుటూరు నియోజకవర్గంలో టీడీపీ అభివృద్ధికి కృషి చేస్తుంటే ఎందుకు అడ్డు తగులుతున్నారని ప్రశ్నించారు వరదరాజులు రెడ్డి. ఎంపీ సీఎం రమేశ్‌ తెర వెనుక రాజకీయాలు నడిపిస్తున్నారని.. మైనార్టీ వార్డులకు సంబంధించిన సమావేశం పెడితే అభ్యంతరం ఏంటని ప్రశ్నించారు. స్థానిక ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రయత్నించడం తప్పా అని నిలదీశారు. తనకు ప్రాణం ఉన్నంత వరకూ సీఎం రమేష్‌ను రానివ్వనన్నారు.

ప్రొద్దుటూరు మున్సిపల్ కౌన్సిలర్ల రాజీనామాల వెనుక పెద్ద కుట్రే ఉందని.. సీఎం రమేష్ కుటుంబంలో వ్యక్తులు ఇక్కడ పోటీ చేయాలనే ఆలోచనతో ఉండటమే కారణమన్నారు. మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక సమయంలో టీడీపీలో చేరిన ముక్తియార్.. వైసీపీ కండువా వేసుకోవడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.ఈ రాజీనామాల వ్యవహారంపై పార్టీ అడిగితే అన్ని వాస్తవాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని.. తనకు తానుగా ఏమీ చేయనన్నారు. పార్టీ ఎవరికి టికెట్‌ ఇచ్చినా కట్టుబడి పనిచేస్తానన్న ఆయన.. ఇలాంటి రాజకీయాలను తాను అంగీకరించేది లేదన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.