యాప్నగరం

వాటికి లక్షల కోట్లు.. ఏపీ రాజధానికి 2500 కోట్లా?

ఏపీకి కేంద్రం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ టీడీపీ నేత కాట్రగడ్డ బాబు విజయవాడలో గతవారం ఏర్పాటు చేసిన హోర్డింగులపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

Samayam Telugu 11 Mar 2018, 12:35 pm
ఏపీకి కేంద్రం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ టీడీపీ నేత కాట్రగడ్డ బాబు విజయవాడలో గతవారం ఏర్పాటు చేసిన హోర్డింగులపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ ఫ్లెక్సీల్లో కేంద్రం, ప్రధాని నరేంద్ర మోదీని విమర్శించిన తీరుని బీజేపీ నేతలు తీవ్రంగా తప్పుపట్టారు. తాజాగా అలాంటి ఫ్లెక్సీనే టీడీపీ నేతలు ఏర్పాటుచేయడం చర్చనీయాంశంగా మారింది. గుజరాత్‌లో బుల్లెట్ రైలుకు లక్ష కోట్లు, దిల్లీ-ముంబయి పారిశ్రామిక కారిడార్లలో భాగంగా లక్ష కోట్లు, గుజరాత్ గిఫ్ట్ సిటీకి లక్ష కోట్లు నిధులు మంజూరు చేసిన ప్రధాన మంత్రి మోదీ ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణానికి మాత్రం కేవలం రూ.2500 కోట్ల కేటాయించడం ఎంతవరకు సబబంటూ ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. బీజేపీ చేస్తోన్న అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టాలని కోరుతూ నందిగామ మండల టీడీపీ ఆధ్వర్యంలో విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.
Samayam Telugu tdp leaders hanging flexes against bjp and union government
వాటికి లక్షల కోట్లు.. ఏపీ రాజధానికి 2500 కోట్లా?


రాష్ట్ర విభజన తర్వాత రూ.16 వేల కోట్లు గ్రాంటుగా ఇవ్వాల్సిన కేంద్రం ఈఏపీ నిధుల పేరుతో ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తోందని తెదేపా నేతలు ఆరోపించారు. గ్యాస్ రాయల్టీ కింద ఆంధ్రప్రదేశ్‌కు 12 వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసిన రూ. 4వేల కోట్లును కేంద్రం ఇవ్వలేదని, ఇప్పుడు 14వ ఆర్ధిక సంఘం పేరిట ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని చెప్పడాన్ని ప్రజలందరూ గమనించాలని ఫ్లెక్సీలో పేర్కొన్నారు. గుజరాత్‌లో కన్వెన్షన్ సెంటర్‌కు రూ. 1700 కోట్ల మంజూరు చేసిన కేంద్రం, ఆంధ్రుల ఆత్మగౌరవానికి చిహ్నమైన రాజధాని అమరావతికి రూ2500 కోట్ల ఇచ్చి డీపీఆర్ ఇవ్వకుండానే మంజూరు చేశామని అబద్ధాలు చెబుతోందని అన్నారు. ఈ ఫ్లెక్సీలను అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.