యాప్నగరం

తిరుమలకు అమిత్‌ షా.. అడుగడుగునా నిరసనలు!

కర్ణాటక శాసనసభ ఎన్నికల ప్రచారాన్ని ముగించుకుని శుక్రవారం శ్రీవారి దర్శనానికి విచ్చేసిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమితా షాకు ప్రత్యేక హోదా సెగ తగిలింది.

Samayam Telugu 11 May 2018, 12:27 pm
కర్ణాటక శాసనసభ ఎన్నికల ప్రచారాన్ని ముగించుకుని శుక్రవారం శ్రీవారి దర్శనానికి విచ్చేసిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమితా షాకు ప్రత్యేక హోదా సెగ తగిలింది.
Samayam Telugu టీడీపీ నిరసనలు

శ్రీవెంకటేశ్వరుని దర్శనార్థం ఈ ఉదయం తిరుమలకు చేరుకున్న అమిత్ షాను అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేశారు. టీడీపీ కార్యకర్తలు, ప్రజా సంఘాలతోపాటు శ్రీవారి భక్తులు కూడా ఆయన రాకను నిరసిస్తూ నినాదాలు చేశారు. అమిత్ షా రాకను ముందే తెలుసుకున్న తిరుపతి వాసులు అలిపిరి వద్దకు చేరుకుని ‘అమిత్ షా గో బ్యాక్’ అంటూ నినదించారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన అమిత్ షా తిరుమలకు రావడం ఏంటని నిలదీశారు. ఇదే వెంకన్న సాక్షిగా ఇచ్చిన హామీలను మరచిపోయారని ఆందోళనలు చేశారు. నల్లబ్యాడ్జీలు ధరించిన నిరసనకారులు.. అమిత్ షా గోబ్యాక్ అంటూ

టీడీపీ నేతలు, కార్యకర్తలు నిరసన చేపట్టగా, కాలినడకన భక్తులు సైతం వీరికి జతకలిశారు. నిరసనలను ముందుగానే పసిగట్టిన పోలీసులు, భారీ ఎత్తున బలగాలను అలిపిరిలో మోహరించి ఆందోళనకారులను అడ్డుకున్నారు. అలిపిరి నుంచి తిరుమలకు చేరుకున్న అమిత్ షాకు, అక్కడ కూడా భక్తుల నినాదాలతో స్వాగతం పలికారు. ఆయన కాన్వాయ్ వెళుతుంటే, రహదారి పక్కన ఉన్న భక్తులు హోదా కోసం నినాదాలు చేశారు. అమిత్ షాకు స్వాగతం పలికిన టీటీడీ అధికారులు, ప్రొటోకాల్ ప్రకారం దర్శన ఏర్పాట్లు చేసి, తీర్థ ప్రసాదాలు అందించారు. శ్రీవారి దర్శనం అనంతరం దిగువకు వచ్చిన షాను మళ్లీ అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ ఈ సందర్భంగా టీడీపీ, బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో బీజేపీ నేతల వాహనాలపై నిరసనకారులు రాళ్లు రువ్వడంతో అద్దాలు ధ్వంసమయ్యాయి. పటిష్ఠ భద్రత మధ్య అమిత్ షా రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.