యాప్నగరం

మోత్కుపల్లి కీలుబొమ్మ.. ఎవరు ఆడిస్తున్నారో తెలుసు: ఎమ్మెల్యే సండ్ర

చంద్రబాబుపై మోత్కుపల్లి చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ టీడీపీ నేతల నుంచి కౌంటర్లు మొదలయ్యాయి. టీడీపీని, బాబును విమర్శించే నైతిక అర్హత మోత్కుపల్లికి లేదంటూ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మండిపడ్డారు.

Samayam Telugu 28 May 2018, 1:52 pm
చంద్రబాబుపై మోత్కుపల్లి చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ టీడీపీ నేతల నుంచి కౌంటర్లు మొదలయ్యాయి. టీడీపీని, బాబును విమర్శించే నైతిక అర్హత మోత్కుపల్లికి లేదంటూ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మండిపడ్డారు. రాజకీయ ప్రత్యర్థుల చేతుల్లో ఆయన కీలుబొమ్మయ్యారని.. ఉద్దేశపూర్వకంగానే మహానాడు సమయంలో ఆరోపణలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. పవన్, జగన్‌ను పొడుగుతున్న ఆయన్ను.. ఎవరు ఆడిస్తున్నారో తెలుసన్నారు. ఆయకు సస్పెండ్ అవసరం లేదని.. రాజకీయ జీవితం ముగిసిపోయిందన్నారు.
Samayam Telugu Sandra


మోత్కుపల్లి తన స్థాయిని దిగజార్చుకొని.. వ్యక్తిగత స్వార్థంతోనే బాబుపై విమర్శలు చేస్తున్నారన్నారు సండ్ర. ఆయనకు పార్టీలో అధినేత ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని.. నల్గొండలో పోటీ చేయనని పారిపోయి వస్తే... ఖమ్మంలో అవకాశం కల్పించ లేదా అని ప్రశ్నించారు. నర్సింహులకు నోటి దురుసు ఎక్కువని.. అందుకే 1989లో ఎన్టీఆర్ పార్టీ టిక్కెట్ కూడా ఇవ్వలేదన్నారు. తెలంగాణలో దుర్మార్గపు పాలన చేస్తున్న కేసీఆర్‌ను ఎన్టీఆర్‌తో పోల్చినప్పుడే ఆయన రాజకీయం ఏంటో అర్థమయ్యిందన్నారు వీరయ్య. గవర్నర్ పదవి గురించి మాట్లాడే మోత్కుపల్లి.. ఆయన్ను బీజేపీ దగ్గరికి తీసుకెళ్లి మాట్లాడించింది వాస్తవమా కాదో చెప్పాలన్నారు. ఆ పదవి బీజేపీ ఇవ్వకపోతే చంద్రబాబు ఏం చేస్తారని ప్రశ్నించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.