యాప్నగరం

నడిరోడ్డుపై బైఠాయించిన టీడీపీ ఎమ్మెల్యే

ఏపీ అధికారపార్టీ ఎమ్మెల్యే గౌతు శ్యామ్ సుందర్ శివాజీకి సోమవారం చేదు అనుభవం ఎదురైంది.

Samayam Telugu 20 Mar 2017, 12:06 pm
ఏపీ అధికారపార్టీ ఎమ్మెల్యే గౌతు శ్యామ్ సుందర్ శివాజీకి సోమవారం చేదు అనుభవం ఎదురైంది. విజయవాడ కరకట్టపై నుంచి అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు ఆయన బయలుదేరుతుండగా...పోలీసులు నిలువరించారు. సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఇదే మార్గంలో వస్తున్నందున..ఎమ్మెల్యే వెళ్లడానికి వీల్లేదని పోలీసులు శివాజీని ఆపారు. దీంతో శివాజీ అక్కడే రోడ్డుపై బైఠాయించి గంటపాటు నిరసన తెలిపారు.
Samayam Telugu tdp mla shivaji stopped by police sits in protest
నడిరోడ్డుపై బైఠాయించిన టీడీపీ ఎమ్మెల్యే


పోలీసు ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని శివాజీకి నచ్చజెప్పారు. అనంతరం ఉండవల్లి మార్గంలో ఆయన్ను అసెంబ్లీకి పంపించారు.

శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న శివాజీకి గతంలోనూ ఇలాంటి అనుభావాలే ఎదురయ్యాయి. జిల్లా పర్యటనకు సీఎం వచ్చిన సందర్భంగా హెలిప్యాడ్ వద్దకు వెళ్లిన శివాజీని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన అక్కడే నిరసన తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.