యాప్నగరం

కిడారి, సోమల హత్యల వెనుక వైసీపీ హస్తం: టీడీపీ ఎమ్మెల్యే

ప్రశాంతంగా ఉన్న మన్యంలో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమల హత్యతో జనం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మెరుపుదాడితో మావోలు వారిని మట్టుబెట్టారు.

Samayam Telugu 28 Sep 2018, 7:58 am
అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మావోయిస్టులు దారుణంగా హత్యచేసిన విషయం తెలిసిందే. అయితే, దీనికి రాజకీయ రంగు పులుముకుంది. కిడారి, సోమల హత్య వెనుక వైసీపీ నేతల హస్తం ఉందంటూ ఎమ్మెల్యే, విశాఖ నగర టీడీపీ వాసుపల్లి గణేష్‌కుమార్‌ సంచలన ఆరోపణలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... వైసీపీ తరఫున బరిలో నిలిచి విజయం సాధించిన కిడారి సర్వేశ్వరరావు టీడీపీలో చేరిన తర్వాత ఆ పార్టీ నేతలు బెదిరిస్తూనే ఉన్నారని అన్నారు. మాజీ ఎమ్మెల్యే సోమను గతంలో ఎప్పుడు మావోలు హెచ్చరించిన దాఖలాలు లేవని పేర్కొన్నారు. కిడారి, సోమలను హత్యకు గురైన లివుటిపుట్టు గ్రామంలో వైసీపీ నేతలు ఉన్నారని, అక్కడే మాటువేసి మరీ దాడిచేశారని ఆరోపించారు.
Samayam Telugu కిడారి, సోమ


ఒకవేళ మావోయిస్టులే ఈ హత్యలను చేసి ఉంటే ఇప్పటికే దీనిపై ప్రకటన విడుదల చేసేవారని, ఇంతవరకూ అలాంటిది రాకపోవడం, ఇతరత్రా అంశాలను లోతుగా పరిశీలిస్తే దీని వెనుక వైసీపీ నేతల హస్తం ఉండవచ్చనే అనుమానాలు బలపడుతున్నాయని వాసుపల్లి ఆరోపించారు. ఈ అంశాల గురించి నగర పోలీసు కమిషనర్‌‌కు తెలియజేస్తామని, ఈ హత్యలపై దర్యాప్తు చేపట్టిన సిట్‌, నిఘా వర్గాలు తమ అనుమానాలను పరిగణనలోకి తీసుకుని వాస్తవాలను వెలుగులోకి తేవాలని ఆయన డిమాండ్‌ చేశారు. కిడారి సర్వేశ్వరరావు హత్య జరిగిన రోజున ప్రతిపక్ష నేత జగన్‌ జిల్లాలో పర్యటిస్తున్నారని, కనీసం కడసారి చూపు కోసమైనా ఆయన వెళ్లకపోవడం దారుణమన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.