యాప్నగరం

దారుణం...కేసీఆర్‌తో నాకు సంబంధాలా?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో తనకు సంబంధాలు ఉన్నాయంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత పయ్యావుల కేశవ్ స్పందించారు.

TNN 23 Oct 2017, 12:14 pm
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో తనకు సంబంధాలు ఉన్నాయంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత పయ్యావుల కేశవ్ స్పందించారు. రేవంత్ వ్యాఖ్యలు తనను ఎంతో బాధించాయని ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్‌తో తనకు సంబంధాలను అంటగట్టడం దుర్మార్గమని అన్నారు. గత పాతికేళ్లలో పార్టీకి నష్టం కలిగించే ఏ ఒక్క పనిని కూడా తాను చేయలేదని, రేవంత్ రెడ్డికి తమ అధినేత చంద్రబాబు ఎంతో ప్రాధాన్యతను ఇచ్చారని తెలిపారు. గత ఆరు నెలలుగా రేవంత్ ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారని... దానికి సంబంధించిన సమాచారం తన వద్ద ఉందని చెప్పారు. చంద్రబాబును రేవంత్ కలిసిన తర్వాతే తాను స్పందిస్తానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో రేవంత్ చేరే విషయంపై తాను ఇప్పడు ఏమీ మాట్లాడనని అన్నారు. రేవంత్ జైలుకు వెళ్లినప్పుడు ఆయన కుటుంబానికి అండగా ఉన్నానని, వ్యక్తిగత ప్రయోజనాల కోసం స్నేహితులను బలిచేయడం తగదని అన్నారు.
Samayam Telugu tdp mlc payyavula keshav denied relations with telangana cm kcr
దారుణం...కేసీఆర్‌తో నాకు సంబంధాలా?


పార్టీ కంటే వ్యక్తిగత అజెండానే రేవంత్‌కు ముఖ్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు, మంత్రి యనమలకు రేవంత్ సర్టిఫికెట్ అవసరం లేదని పేర్కొన్నారు. నాకు, పరిటాల కుటుంబానికి తెలంగాణలో ఎలాంటి వ్యాపారాలు లేవని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి పరిటాల సునీత తనయుడు శ్రీరామ్ వివాహానికి తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరైనప్పుడు టీడీపీ నేతలు వంగి వంగి దండాలు పెట్టారని రేవంత్ రెడ్డి విమర్శించిన విషయం తెలిసిందే. అలాగే పయ్యావుల కేశవ్‌ను ప్రజలు గత ఎన్నికల్లో తిరస్కరించారని, ఆయన గురించి మాట్లాడటం అనవసరమని అన్నారు. అంతేకాదు తెలంగాణలో ఆయనకు వ్యాపారాలు ఉన్నాయని, అందుకే కేసీఆర్‌తో ఏకాంతంగా సమావేశమయ్యారని ఆరోపించారు. ఏపీ మంత్రులకు తెలంగాణలో పనేంటని ప్రశ్నించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.