యాప్నగరం

ఏపీకి పారిశ్రామిక రాయితీలు ఇవ్వాల్సిందే.. లోక్‌సభలో ఎంపీ గల్లా గళం

ఏపీకి ఇచ్చిన విభజనహామీల విషయంలో కేంద్రంపై టీడీపీ పోరాటం కొనసాగుతోంది. కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు దొరికిన ప్రతి అవకాశాన్ని వినిగియోగించుకుంటున్నారు ఎంపీలు.

Samayam Telugu 9 Aug 2018, 6:32 pm
ఏపీకి ఇచ్చిన విభజనహామీల విషయంలో కేంద్రంపై టీడీపీ పోరాటం కొనసాగుతోంది. కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు దొరికిన ప్రతి అవకాశాన్ని వినిగియోగించుకుంటున్నారు ఎంపీలు. ఏపీకి జరిగిన అన్యాయంపై మరోసారి లోక్‌సభలో గళం విప్పారు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్. జీఎస్టీ సవరణల బిల్‌పై లోక్‌సభలో జరిగిన చర్చ సమయంలో.. విభజన చట్టంలోని అంశాలను ప్రస్తావిస్తూ.. మరోసారి కేంద్రాన్ని నిలదీశారు. ఏపీకి న్యాయం చేయాలంటూ తన బలమైన వాదనను వినిపించారు.
Samayam Telugu Galla


విభజన చట్టంలోని ఏ అంశాన్ని కేంద్రం నెరవేర్చడం లేదన్నారు ఎంపీ గల్లా జయదేవ్. ఏపీలో పారిశ్రామిక అభివృద్ధి కోసం ప్రత్యేక విధానం అమలు చేస్తామన్నకేంద్రం.. ఆ దిశగా ఇప్పటి వరకూ చర్యలు తీసుకోలేదన్నారు. అశాస్త్రీయ విభజనతో రాష్ట్రం చాలా నష్టపోయిందని.. ఈశాన్య రాష్ట్రాలకు ఇస్తున్నట్లుగానే.. ఆంధ్రప్రదేశ్‌కు కూడా పన్ను రాయితీలు, ప్రోత్సాహకాలు ఇవ్వాన్నారు. జీఎస్టీతో ఏపీ ప్రభుత్వం ఏడాదికి రూ.2600 కోట్లు నష్టపోతుందని.. అయినా కేంద్రం రాష్ట్రానికి ఇప్పటి వరకూ ఒక్క పైసా కూడా ఇవ్వలేదన్నారు.

ఆర్థిక సమస్యలతో ఇబ్బందిపడుతున్న ఏపీకి విభజన చట్టంలో పొందుపరిచిన విధంగా న్యాయం చేయాలని డిమాండ్ చేశారు జయదేవ్. రియల్‌ ఎస్టేట్‌పై జీఎస్టీ 5శాతం ఉండాలని.. ఎండుమిర్చి, చింతపండు, పసుపు పంటలకు జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. లోక్‌సభలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం తర్వాత కూడా టీడీపీ పార్లమెంట్‌లో తమ గళం వినిపిస్తోంది. సీఎం చంద్రబాబు సూచనతో క్వశ్చన్ అవర్, జీరో అవర్‌లో ఏపీకి ఇచ్చిన హామీలను లోక్‌సభలో ప్రస్తావిస్తున్నారు ఎంపీలు. అలాగే కాపు రిజర్వేషన్లపై కూడా ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెట్టారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.