యాప్నగరం

‘బీజేపీకి ఇప్పుడు పీకుడు కావాలి.. అది ఎలా ఉండాలో సీఎం చెప్పాలి’

బడ్జెట్‌లో ఏపీకి కేటాయింపుల్లో ఎలాంటి ప్రాధాన్యత లేకపోవడంతో ఎన్డీఏ మిత్రపక్షమైన అధికార టీడీపీ తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేస్తోన్న విషయం తెలిసిందే.

TNN 6 Feb 2018, 7:59 am
బడ్జెట్‌లో ఏపీకి కేటాయింపుల్లో ఎలాంటి ప్రాధాన్యత లేకపోవడంతో ఎన్డీఏ మిత్రపక్షమైన అధికార టీడీపీ తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేస్తోన్న విషయం తెలిసిందే. దీనికి అనుగుణంగానే బడ్జెట్ సమావేశాల తొలిరోజు సభ ప్రారంభమైన కొద్దిసేపటికే విభజన హామీల అమలుపై టీడీపీ స్వల్పకాలిక చర్చ చేపట్టాలని నోటీస్ ఇచ్చింది. మరోవైపు పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం ముందు ఆ పార్టీ ఎంపీలు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలోనే ఓ టెలివిజన్ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
Samayam Telugu tdp mp jc diwakar reddy comments against pm modi
‘బీజేపీకి ఇప్పుడు పీకుడు కావాలి.. అది ఎలా ఉండాలో సీఎం చెప్పాలి’


ఆంధ్రప్రదేశ్ ప్రజలపై, సీఎం చంద్రబాబుపై ప్రధాని నరేంద్ర మోదీ కక్షగట్టారని ఆయన ఆరోపించారు. రాష్ట్ర విభజన హామీల అమలు, కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి అన్యాయం జరగడంపై ఆయన మాట్లాడుతూ, ‘మేము ప్రయత్నం చేస్తున్నామని ప్రజలకు చెప్పుకోవడానికే తప్ప, చివరకు ఎలాంటి ఫలితాలు రావు. ఈ విషయం అందరికీ తెలిసిందే! ఈ రోజున పార్లమెంట్‌లో గాంధీ బొమ్మ దగ్గరకు పోయి మేము నిలబడ్డాం..వారు కనకరిస్తారా? రేపు ప్లకార్డులు పట్టుకుని వెల్‌లోకి వెళితే మార్పొస్తుందా? ఏమీ రాదు! కదా’ అని వ్యాఖ్యానించారు.

‘రాజకీయ నాయకులు అంత సున్నితమైన వాళ్లయితే, మన బతుకులు ఇలా ఎందుకు ఉంటాయి? కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి అన్యాయం చేశారనే విషయం చాలా స్పష్టంగా కనబడుతోంది. ఇది ఒక రకమైన కక్ష సాధింపు చర్యలేమోనని నాకు అనుమానంగా ఉంది... ఈ కక్షసాధింపు మా నాయకత్వంపైనా? లేక రాష్ట్రంపైనా? నాకు అర్థం కావడంలేదని’ జేపీ పేర్కొన్నారు. పిల్లలు మాట విననప్పుడు ఒకటి రెండుసార్లు చెబుతాం...ఆ తర్వాత ఒకటి పీకుతాం. ఇప్పుడు, కూడా బీజేపీకి అదే కావాలి. ఆ పీకుడు ఎలా ఉండాలనేది ముఖ్యమంత్రిగారు చెప్పాలి ... చెయ్యాలని అన్నారు. ఎందుకో, ముఖ్యమంత్రి చాలా సంయమనంతో పోతున్నారు! మా సీఎం చాలా బాధ్యత గల వ్యక్తి కాబట్టి ఆ రకంగా ఆలోచన చేస్తున్నారు. బీజేపీపై ప్రజల్లో ఏ రకమైన ఏహ్యభావం ఉందనే విషయాన్ని మనం నిరూపించాల్సిన అవసరం ఉందని చంద్రబాబు నాయుడుకి ఎప్పుడో చెప్పా.. నా సలహా ఇచ్చా... అన్నింటికీ సంయమనం..సంయమనం అంటే ఎట్లా?’ అని జేసీ దివాకర్‌రెడ్డి మండిపడ్డారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.