యాప్నగరం

జగన్ సీఎం పదవిపై జేసీ జోస్యం!

విమర్శలు గుప్పించడంలో అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి స్టైలే వేరు. అది విపక్షమా, స్వపక్షమా అనే తేడా ఉండదు.

TNN 3 Mar 2017, 11:34 pm
విమర్శలు గుప్పించడంలో అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి స్టైలే వేరు. అది విపక్షమా, స్వపక్షమా అనే తేడా ఉండదు. తాజాగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం ఎంపీ దివాకర్‌ రెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్‌కు అధికారమనే పిచ్చిపట్టిందని అన్నారు. జగన్ ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేరని జేసీ జోస్యం చెప్పారు. ఆయనకు సీఎం పదవి కలగానే మిగిలిపోతుందని పేర్కొన్నారు.
Samayam Telugu tdp mp jc diwakar reddy comments on ys jagan
జగన్ సీఎం పదవిపై జేసీ జోస్యం!


దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటనపై జగన్మోహన్ రెడ్డి అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్సు ప్రమాదం కేవలం మానవ తప్పిదమని, అంతే కానీ దాన్ని అనవసరంగా రాజకీయం చేయాలనుకోవడం తగదని హితవు పలికారు. ఈ విషయాన్ని ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతలు తెలుసుకుంటే మంచిదని జేసీ అన్నారు. ఈ ప్రమాద ఘటనపై పదే పదే వైసీపీ నేతలు మీడియా ముందుకు వచ్చి రాజకీయం చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు.

అలాగే శవ రాజకీయాలు జగన్‌కు అలవాటేనని ఎద్దేవా చేశారు. బస్సు ప్రమాదం చాలా బాధాకరమని, ఆ ఘటనలో ప్రాణాలు కోల్పోయివారి కుటుంబాలను ఆదకుంటామని ఆయన అన్నారు. సోమవారం భువనేశ్వర్ నుంచి హైదరాబాద్‌ వెళ్తోన్న దివాకర్ ట్రావెల్స్ బస్సు కృష్ణా జిల్లా నందిగామ దగ్గర జాతీయ రహదారిపై ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోగా, కనీసం 30 మంది గాయపడ్డారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.