యాప్నగరం

మోదీ ఉన్నంతకాలం హోదానే రాదు: ఎంపీ జేసీ

మోదీపై మండిపడ్డారు టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి. ప్రధానిగా మోదీ ఉన్నంతకాలం ఏపీకి ప్రత్యేక హోదా రాదన్నారు. ప్రధానిది కక్ష సాధింపు చర్యని... ఆయన వల్ల రాష్ట్రానికి ఎలాంటి న్యాయం జరగదన్నారు.

Samayam Telugu 10 Apr 2018, 12:53 pm
మోదీపై మండిపడ్డారు టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి. ప్రధానిగా మోదీ ఉన్నంతకాలం ఏపీకి ప్రత్యేక హోదా రాదన్నారు. ప్రధానిది కక్ష సాధింపు చర్యని... ఆయన వల్ల రాష్ట్రానికి ఎలాంటి న్యాయం జరగదన్నారు. అయినా నిరాశ చెందకుండా హోదా కోసం పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు జేసీ. ఇకపై ప్రజల్లోకి వెళ్లి నిరసనను తెలుపుతామన్నారు. సీఎం చంద్రబాబు 29సార్లు ఢిల్లీ వెళ్లినా కనీసం పట్టించుకోలేదని గుర్తు చేశారు. మంత్రులు, ఎంపీలపై సీబీఐ దర్యాప్తు జరుపుకోవాలనుకుంటే... జరుపుకోవచ్చని సవాల్ విసిరారు.
Samayam Telugu JC DIWAKAR.


వైసీపీ ఎంపీల దీక్షపై జేసీ స్పందించారు. దొంగ రాజీనామాలతో ప్రజల్ని మోసం చేయాలని వైసీపీ ప్రయత్నిస్తోందన్నారు. ఆ పార్టీ ఎంపీలది డ్రామా దీక్షని... జగన్‌కు దమ్ముంటే ముందు రాజ్యసభ ఎంపీలతో రాజీనామా చేయించాలన్నారు. వారు రాజీనామాల చేస్తే... టీడీపీ ఎంపీలు కూడా రాజీనామాకు సిద్ధంగా ఉన్నారన్నారు జేసీ. అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేని రాహుల్... ఏపీకి ఇప్పుడేం చేయగలడని ప్రశ్నించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.