యాప్నగరం

వాళ్లిద్దరికి కుర్చీపైనే ఆశ..కర్ణాటకలో కాంగ్రెస్ గెలుస్తుంది: జేసీ

ఏపీలో తాజా రాజకీయ పరిణామాలపై స్పందించారు టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. అనంతపురంలో మీడియాతో మాట్లాడిన జేసీ... పవన్‌, జగన్‌పై సెటైర్లు వేశారు.

Samayam Telugu 25 Apr 2018, 6:48 pm
ఏపీలో తాజా రాజకీయ పరిణామాలపై స్పందించారు టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. అనంతపురంలో మీడియాతో మాట్లాడిన జేసీ... పవన్‌, జగన్‌పై సెటైర్లు వేశారు. పవన్, జగన్‌కు కుర్చీపైన ఆశ తప్ప... ఏపీ ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశం లేదన్నారు జేసీ. ఇద్దరూ సీఎం కావాలని కలలు కంటున్నారని... అవి నేరవేరవన్నారాయన. చిరంజీవి కూడా ముఖ్యమంత్రి పదవిపై ఆశ పెట్టుకున్నారని... పవన్‌ ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో చాలా చిన్నోడన్నారు . సీఎం చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతున్నారని... ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన్ను మరోసారి గెలిపిస్తేనే రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు.
Samayam Telugu JC


గవర్నర్‌పై, కర్ణాటక ఎన్నికలపైనా జేసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా విషయంలో గవర్నర్ పాత్ర సరిగా లేదని... ఆయన బతక నేర్చిన వ్యక్తి అన్నారు. ఆనాడు ఇందిరాగాంధీ... యూపీఏ హయాంలో సోనియా గాంధీకి... ఇప్పుడు మోదీకి అనుకూలంగా ఉండేవారన్నారు. కర్ణాటకలో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని జోస్యం చెప్పారు ఎంపీ జేసీ.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.