యాప్నగరం

'పిచ్చోడి చేతిలా రాయిలా.. జగన్ చేతిలో అధికారం': ఎంపీ కేశినేని

'అమ్మ పెట్టలేదు అడుక్కు తిననివ్వదు అన్నట్లుంది నిరుద్యోగుల పరిస్థితి. జగన్ చేసిన చట్టమే రేపు మిగిలిన రాష్ట్రాలు చేస్తే మన వాళ్లకు ఉద్యోగాలు వస్తాయ జగన్ గారూ'

Samayam Telugu 24 Jul 2019, 12:26 pm
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై విరుచుకుపడ్డారు విజయవాడ ఎంపీ కేశినేని నాని. ఘాటు వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో టార్గెట్ చేశారు. జగన్ తీసుకున్న అనాలోచిత నిర్ణయంతో నిరుద్యోగులకు ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో యువతకు కష్టాలు ఎదరవుతాయంటున్నారు విజయవాడ ఎంపీ.
Samayam Telugu nani


కేశినేని తన ట్వీట్‌లో ‘జగన్ రెడ్డి గారూ.. పిచ్చి వాడి చేతిలో రాయిలాగా ఉంది మీ చేతిలో అధికారం.. మీరు చేసిన చట్టమే రేపు ఇతర రాష్ట్రాలు చేస్తే హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై, ముంబై, పూణె ఢిల్లీ లాంటి చోట్లలో మన వారికి ఉద్యోగాలు వస్తాయా?. అమ్మ పెట్టలేదు అడుక్కు తిననివ్వదు అన్నట్లుంది పరిస్థితి’అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో ప్రైవేట్ సంస్థలు, పరిశ్రమల్లో 75శాతం ఉద్యోగాలు స్థానికులకు ఇచ్చేలా ఏపీ ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది. ఈ నిర్ణయం ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసే సంస్థలు, పరిశ్రమల్లో 75శాతం ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వాల్సి ఉంటుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ నిర్ణయాన్ని విజయవాడ ఎంపీ తప్పుబట్టారు.. ఈ చట్టం వల్ల నిరుద్యోగులకు కష్టాలు పెరుగుతాయంటున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.