యాప్నగరం

సొంత పార్టీ ఎమ్మెల్సీపై బాబుకు ఎంపీ ఫిర్యాదు

టీడీపీ ఎమ్మెల్సీ చేసిన వ్యాఖ్యల్ని ఎంతో బాధించాయంటూ ఆ పార్టీకే చెందిన ఎంపీ చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. ఆయనలా మాట్లాడాల్సింది కాదని అధినేత దగ్గర వాపోయారట.

Samayam Telugu 22 Mar 2018, 11:09 am
టీడీపీ ఎమ్మెల్సీ చేసిన వ్యాఖ్యల్ని ఎంతో బాధించాయంటూ ఆ పార్టీకే చెందిన ఎంపీ చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. ఆయనలా మాట్లాడాల్సింది కాదని అధినేత దగ్గర వాపోయారట. మొన్న టాలీవుడ్‌‌పై ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ సంచలన వ్యాఖ్యాలు చేశారు. హోదాకు మద్దతు ఎందుకు ఇవ్వరని మండిపడ్డారు. ఈ కామెంట్లపై ఎంపీ మురళీమోహన్ బాబుతో తన గోడును వెళ్లబోసుకున్నారట. ఉదయం జరిగిన టెలీకాన్ఫరెన్స్‌లో ఈ ప్రస్తావన వచ్చినట్లు తెలుస్తోంది. మెజార్టీ నటులు, సాంకేతిక సిబ్బంది మన పార్టీలోనే ఎక్కువమంది ఉన్నారని గుర్తు చేశారట. రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలు తనతో పాటూ ఇండస్ట్రీలో చాలమందిని బాధపెట్టాయని అభిప్రాయం వ్యక్తం చేశారట.
Samayam Telugu Babu


మురళీ మోహన్ ఆవేదనపై స్పందించిన చంద్రబాబు... రాజేంద్ర ప్రసాద్ ఏమని వ్యాఖ్యానించారో గమనించలేదన్నారట. ఎవర్నీ వ్యక్తిగతంగా విమర్శించ కూడదన్నది టీడీపీ విధానమని... అలా ఎవరు ప్రవర్తించినా ఊరుకునేది లేదన్నారట. దీనిపై నేతలతో చర్చించాక మాట్లాడతానని చెప్పారట. మరి దీనిపై ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ ఎలా స్పందిస్తారో చూడాలి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.