యాప్నగరం

దీక్ష విరమించిన ఎంపీ రామ్మోహన్ నాయుడు

పార్లమెంట్ ఆవరణలో ఒక్కరోజు నిరాహార దీక్ష . ఏపీకి హోదా, విభజన హామీల అమలు చేయాలంటూ పుట్టిన రోజు నాడే దీక్ష. సాయంత్రం దీక్ష విరమింపజేసిన అశోక్‌గజపతి రాజు.

Samayam Telugu 18 Dec 2018, 6:18 pm
ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోరుతూ టీడీపీ ఎంపీలు ఢిల్లీ వేదికగా నిరసన కొనసాగిస్తున్నారు. పార్లమెంటు ఆవరణలో ఉదయం టీడీపీ ఎంపీలు నిరసన ప్రదర్శన చేశారు. అయితే కేంద్ర వైఖరికి నిరసనగా శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌ నాయుడు నిరసన దీక్ష చేపట్టారు. తన పుట్టిన రోజు నాడు.. పార్లమెంటు ఆవరణలో గాంధీ విగ్రహం దగ్గర ఉదయం నుంచి సాయంత్రం వరకు దీక్షను కొనసాగించారు. ఆయనతో పాటూ రాజమండ్రి ఎంపీ మురళీ మోహన్ కూడా దీక్షకు కూర్చున్నారు. సాయంత్రం కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతి రాజు ఇద్దరు ఎంపీలకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు.
Samayam Telugu Ram


ఏపీ ప్రజల ఆవేదనను కేంద్రానికి తెలియజేసేందుకే దీక్ష చేపట్టానన్నారు రామ్మోహన్ నాయుడు. విభజన చట్టంలో హామీల అమలు కోసం పోరాటం చేస్తున్నామని.. అందులో భాగంగానే తన పుట్టిన రోజు నాడు.. పార్లమెంట్ సాక్షిగా దీక్షకు దిగానన్నారు. తమ కొత్తగా ఏమీ కోరవడం లేదని.. ఎన్నికల సమయంలో మోదీ తిరుపతిలో వెంకన్న సాక్షిగా ఇచ్చిన హామీలనే అమలు చేయాలని అడుగుతున్నామన్నారు. పార్లమెంట్‌లో ఏపీ గళం వినిపించాలనుకుంటే.. బీజేపీ అన్నాడీఎంకే ఎంపీలతో ఉభయ సభలు జరగకుండా చేస్తోందని ఆరోపించారు.

ఏపీకి న్యాయం చేయాలంటూ ఎన్నో విధాలుగా పోరాటాలు చేశామన్నారు రామ్మోహన్. రాష్ట్రానికి న్యాయం జరిగే వరకు తమ పోరు కొనసాగుతుందన్నారు. విభజన హామీలను నెరవేర్చే వరకు వెనుకడుగువేసే ప్రసక్తే లేదని చెప్పారు. కేంద్రం ఇప్పటికైనా ప్రత్యేక హోదాను ప్రకటించాలని.. రైల్వేజోన్‌‌తో పాటూ మిగిలిన హామీలను నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.