యాప్నగరం

లోక్‌సభలో నేనేం అడగాలి.. టీడీపీ ఎంపీ రిక్వెస్ట్, నెటిజన్ల నుంచి అనూహ్యస్పందన!

కింజరాపు ఎర్రంనాయుడు కుమారుడైన రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం లోక్‌సభ స్థానం నుంచి వరుసగా రెండోసారి గెలుపొందారు. వైసీపీ ప్రభంజనాన్ని తట్టుకుని టీడీపీ నుంచి గెలిచిన ముగ్గురు ఎంపీల్లో ఆయన కూడా ఒకరు.

Samayam Telugu 10 Jun 2019, 10:36 am

ప్రధానాంశాలు:

  • జూన్ 17 నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం.
  • లోక్‌సభలో అడిగే సమస్యలపై ప్రజలను అభ్యర్థించిన టీడీపీ ఎంపీ
  • రామ్మోహన్ ట్వీట్‌కు నెటిజన్ల నుంచి అనూహ్య స్పందన.
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu tdp_mp
ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభంజనాన్ని తట్టుకుని టీడీపీ నుంచి ముగ్గురు ఎంపీలు విజయం సాధించారు. వారిలో శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు ఒకరు. కింజరాపు ఎర్రంనాయుడు కుమారుడైన రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం లోక్‌సభ స్థానం నుంచి వరుసగా రెండోసారి గెలుపొందారు. 16వ లోక్‌సభలో ఎంపీ రామ్మోహన్, ఏపీకి ప్రత్యేక హోదాపై అనర్గళంగా ప్రసంగించి అందరి ప్రశంసలు అందుకున్నారు. తాజాగా, ఆయన నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. జూన్ 17 నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో సభలో తాను ప్రస్తావించాల్సిన అంశాలను, సమస్యల గురించి తెలియజేయాలని ట్విట్టర్ ద్వారా ప్రజలను కోరారు. వీటిని తన దృష్టికి తీసుకురావాలంటూ ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఎంపీ రామ్మోహన్ నాయుడు ఓ ట్వీట్ చేశారు.
‘కొత్త లోక్‌సభ సమావేశాలు జూన్ 17 నుంచి ప్రారంభం కాబోతున్నాయి.. పార్లమెంటు తాను ఎటువంటి సమస్యల గురించి ప్రస్తావించాలి... ఏదైనా ప్రత్యేక సమస్యను తన ద్వారా లోక్‌సభలో లేవనెత్తాలని లేదా కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లాలని భావిస్తుంటే తెలియజేయండి... ఇందుకోసం #AskRam లేదా #RamSpeaks హ్యాష్‌ట్యాగ్‌ ద్వారా తమ ప్రశ్నలను తెలపాలని’ రామ్మోహన్‌నాయుడు ట్విటర్‌లో కోరారు.

రామ్మోహన్ ట్వీట్‌కు నెటిజన్ల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. ఎక్కువ మంది ఏపీకి ప్రత్యేక హోదాపై పార్లమెంటులో ప్రస్తావించాలని, మోదీ నిలదీయమని సలహా ఇచ్చారు. అలాగే శ్రీకాకుళానికి అదనపు రైళ్లను నడపాలని అడగమన్నారు. విభజన చట్టంలో పేర్కొన్న అన్ని అంశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని కొందరు, నిరుద్యోగులకు ఉపాది అవకాశాలపై మాట్లాడాలని ఇంకొందరు విజ్ఞప్తి చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.