యాప్నగరం

ప్రభుత్వంపై టీడీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

టీడీపీ ఎంపీ శివప్రసాద్ సొంతపార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికార తెలుగుదేశం ప్రభుత్వం

Samayam Telugu 14 Apr 2017, 2:26 pm
టీడీపీ ఎంపీ శివప్రసాద్ సొంతపార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికార తెలుగుదేశం ప్రభుత్వం దళితులను అన్ని విధాలుగా మోసం చేస్తోందని ఆయన ఆరోపణలు గుప్పించారు. అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా చిత్తూరులో ఏర్పాటు చేసిన సభలో శివప్రసాద్ మాట్లాడారు.
Samayam Telugu tdp mp shiva prasad takes on cm chandrababu
ప్రభుత్వంపై టీడీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు


‘ఆంధ్రప్రదేశ్ లో ఎస్సీ,ఎస్టీల జనాభా 25శాతం. వారి జనాభాను బట్టి ఎస్సీ,ఎస్టీ ప్రజాప్రతినిధులకు ఐదు మంత్రి పదవులు రావాలి. కానీ రెండే పదవులిచ్చి చేతులు దులుపుకున్నారు. కేంద్రంలో రాష్ట్రానికి మంత్రి పదవులు వస్తే వాటిని ఓసీలకు కట్టబెట్టారు. ఉప ముఖ్యమంత్రి పదవులను బీసీలకు ఇచ్చారు. ఎస్సీ,ఎస్టీలను అన్ని రకాలుగా మోసం చేస్తున్నారు’’ అని శివప్రసాద్ ప్రభుత్వం, సీఎం చంద్రబాబుపై ధ్వజమెత్తారు.

పరిశ్రమల పేరుతో డీకేటీ భూములను దళితుల నుంచి లాక్కుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేయడం లేదని, ఎస్సీ,ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లిస్తున్నారని ఆరోపించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.